బాసర అమ్మవారి సన్నిధిలో మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజలు
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసరలోని పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. వీరికి ముందుగా ఆలయ అర్చక వైదిక బృందం ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి హారతి, తీర్థ, ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. వీరి వెంట డీసీసీ ఉపాధ్యక్షులు మమ్మాయి రమేష్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు నాగరాజు, మల్కాజిగిరి జిల్లా కార్పొరేటర్ లు తదితరులు పాల్గొన్నారు.




