Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 99

అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమం

0

అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమం

చిత్రం న్యూస్, పెద్దాపురం:

అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమం అనేది అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చేపట్టే ఒక అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం కేవలం పర్యావరణ పరిరక్షణకు సంబంధించినది మాత్రమే కాకుండా, సామాజిక, భావోద్వేగ, ఆరోగ్య, మరియు ఆర్థిక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇది ప్రతి ఒక్కరినీ పర్యావరణ సమస్యలపై స్పృహతో కూడిన చర్యలు తీసుకునేలా ప్రోత్సహిస్తుంది .తల్లితో ఉన్న భావోద్వేగ బంధాన్ని గౌరవించే ఒక అద్భుతమైన మార్గం. పెద్దాపురం బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ బొలిశెట్టి రామకుమార్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బిక్కినవిశ్వేశ్వరరావు, సభ్యత్వ ప్రముఖ్ గోరకపూడి చిన్నయ్య దొర ముఖ్య అతిథులుగా పాల్గొనారు. పార్టీ ఆవిర్భావ సభ్యులు దుర్గా మోహన్ రావు ,సామర్లకోట ప్రధాన కార్యదర్శి జూని మోసెస్ , దేవాడ శ్రీను, కాకి భార్గవి, డి విజయలక్ష్మి, పడాల వీరభద్రరావు, ఓడిమని శివ, కోన రాంబాబు, తోటకూర సత్యనారాయణ, ఉప్పల నాగేశ్వరావు, నెల్లిపూడి బ్రహ్మేశ్వరరావు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆగస్టు 15 కల్లా పదిహేను లక్షల బంగారు కుటుంబాల దత్తత

0

ఆగస్టు 15 కల్లా పదిహేను లక్షల బంగారు కుటుంబాల దత్తత

* చంద్రబాబు స్పష్టీకరణ 

చిత్రం న్యూస్, ఉండవల్లి: ఏపీలో ఆగస్టు 15 కల్లా 15 లక్షల బంగారు కుటుంబాల దత్తత ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మరింత వేగవంతంగా మార్గదర్శకాల నమోదు ప్రక్రియ చేయాలని అధికారులకు సీఎం లక్ష్యాన్ని నిర్దేశించారు. పీ4 విధానంపై బుధవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. రాజధాని భూసేకరణ పీ4కు కేస్‌ స్టడీగా సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు 70వేల కుటుంబాలకు పీ4 ద్వారా సాయం చేశామని గుర్తు చేశారు.

ఏపీలో హెల్త్ కార్డుకు సంబంధించి కీలక ప్రతిపాదన

0

ఏపీలో హెల్త్ కార్డుకు సంబంధించి కీలక ప్రతిపాదన

చిత్రం న్యూస్, ఆంధ్రప్రదేశ్:  ఎన్టీఆర్ వైద్య సేవ కార్డుల జారీలో కీలక మార్పులు రానున్నాయి. రేషన్ కార్డుతో సంబంధం లేకుండానే వైద్య సేవలు అందించాలని శాసనసభ పిటిషన్ల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనివల్ల రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయొచ్చని, ప్రభుత్వానికి రూ.2 వేల కోట్లు ఆదా అవుతాయని రఘురామకృష్ణరాజు అన్నారు. ఆదా అయిన డబ్బును విద్యారంగానికి ఉపయోగించాలని సూచించారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదిస్తుందో లేదో వేచి చూడాలి.

మానవతా దృక్పథంతో రోగులకు సేవలు అందించాలి

0

మానవతా దృక్పథంతో రోగులకు సేవలు అందించాలి

*కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి 

చిత్రం న్యూస్, హుజురాబాద్:

ఆసుపత్రికి వచ్చే రోగులకు మానవతా దృక్పథంతో సేవలు అందించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.  బుధవారం హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిని ఆమె తనిఖీ చేశారు. డయాలసిస్ సెంటర్, ఐసీయూ వార్డులు, ఓపి విభాగం సందర్శించారు. నవజాత శిశువుల వార్డు సందర్శించి పిల్లలకు వచ్చిన సమస్యలను గురించి తెలుసుకున్నారు. లేజర్ రూము, వార్డు పరిశీలన, గర్భిణుల, బాలింతలతో మాట్లాడారు. ఆసుపత్రి సిబ్బంది వారికి అందించిన సేవలను గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తల్లి పాలు ప్రాముఖ్యతను సాధారణ ప్రసవ ప్రాధాన్యతను అక్కడ మహిళలకు వివరించారు .ఇతర వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడారు .అనంతరం ఆసుపత్రిలో కాన్ఫరెన్స్ హాల్లో అధికారులు మెడికల్ ఆఫీసర్ల సమీక్షంలో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసుపత్రిలోని అన్ని రకాల సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బంది కార్ల వివరాలు అడిగి సమర్పించాలని,  ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచేలా సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు . ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు ముందస్తు జాగ్రత్తలు సూచించాలని వైద్య సహాయం అవసరం అనుకుంటే గర్భిణులను ప్రసవం గడుపు కంటే ముందే ఆసుపత్రిలో చేర్పించాలని అన్నారు. అప్రమాలజిస్ట్, రేడియాలజిస్ట్ డెంటిస్ట్ వంటి విభాగాల్లో వారి వారిగా ఓపి సంఖ్యను పరిశీలించారు. నెలసరి నివేదికను సమీక్షించారు. రోగుల పట్ల మానవ కోణంలో వ్యవహరించి వారికి సేవలందించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయా ప్రజలు ప్రైవేటు మందులు దుకాణాల్లో వేల రూపాయలు ఖర్చుతో కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్ సంబంధించిన మందులు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నప్పటికీ ప్రైవేటు లో కొనుగోలు చేయడం దురదృష్టకరమని అన్నారు. ఈ విషయం ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఉచితంగా మందులు తీసుకునేలా చూడాలని సూచించారు. నవజాతి శిశువులను పిల్లల సేవలు పట్ల జాగ్రత్తగా వివరించాలని సూచించారు. ఆసుపత్రిలో ఆరోగ్య మహిళా క్యాంపును వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఐకెపి సిబ్బంది ద్వారా ఆరోగ్యం మహిళా ఉచిత వైద్య పరీక్షల పట్ల మహిళలకు అవగాహన కల్పించి క్యాంపును సద్వినియోగం చేసేలా చూడాలని తెలిపారు. ఈ క్యాంపు ద్వారా సుమారు 50,000 రూపాయలు ఖరీదు చేసి 47 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్న విషయం మహిళల్లో తీసుకెళ్లాలని అన్నారు. ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన మహిళలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి అవసరమైన వారి కి బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి వ్యాధులకు మందులు అందించాలన్నారు. 108 సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. అవసరమైన సౌకర్యాలు సమకూర్చాలని ఆదేశించారు అంతకుముందు ఆసుపత్రి ఆవరణలో జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ డిసిహెచ్ చంద్రశేఖర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి ఆర్ఎన్ఓ డాక్టర్ రమేష్, జమ్మికుంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పారిపల్లి శ్రీకాంత్ రెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్ఓ చందు, ఆర్డీవో రమేష్బాబు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య  పాల్గొన్నారు.

మరిడమ్మ అమ్మవారి  జాతర ప్రారంభానికి ఏర్పాట్లు                         

0

మరిడమ్మ అమ్మవారి  జాతర ప్రారంభానికి ఏర్పాట్లు               

చిత్రం న్యూస్, పెద్దాపురం:

శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆషాడ మాస జాతర మహోత్సవములు ఈ నెల జూన్ 24 వ తారీకు నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ ,కార్య నిర్వహణాధికారిణి కె.విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్బంగా బుధవారం అమ్మవారి గోపురం నీటితో శుభ్రపరిచారు. గురువారం ఉదయం 8:49 నిముషాలకు అమ్మవారి పందిరి రాట ముహూర్తం సందర్బంగా అమ్మవారి భక్తులు రాటకు పసుపు, కుంకుమతో పూసి సిద్ధం చేశారని ఆమె తెలిపారు.

 

హుజురాబాద్ లో  మొక్కలు నాటాలని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు సేవ్ ద ట్రీ  నాయకుల వినతి

0

హుజురాబాద్ లో  మొక్కలు నాటాలని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు సేవ్ ద ట్రీ  నాయకుల వినతి

చిత్రం న్యూస్, హుజురాబాద్

హుజరాబాద్ పట్టణంలో వాడవాడలో విరిగిన మొక్కల స్థానంలో  మళ్లీ మొక్కలు నాటాలని అందుకు ఇప్పటినుండి ఏర్పాట్లు చేయాలని  సేవ్ ద ట్రీ నాయకులు, స్థానికులు మున్సిపల్ కమిషనర్  సమ్మయ్యకు బుధవారం వినతిపత్రం అందజేశారు. పట్టణంలో ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగిన చెట్లు తీసివేసి వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాలని, వాడవాడలా సిసి రోడ్ల చివర మొక్క నాటే స్థలం కోసం డ్రిల్లింగ్ చేసి ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సేవ్ ద ట్రీ గౌరవ అధ్యక్షుడు సాదుల రవీంద్రబాబు, అధ్యక్షుడు మాట అనిల్, ప్రధాన కార్యదర్శిలు మక్కా పల్లి రమేష్, కుడికాల ప్రభాకర్, ప్రకాష్, విశ్రాంతి ,విక్రమ్ తదితరులు పాల్గొన్నారు

తుమ్మనపల్లిలో సొంత ఖర్చులతో శ్మశానవాటిక  నిర్మాణం

0

తుమ్మనపల్లిలో సొంత ఖర్చులతో శ్మశానవాటిక  నిర్మాణం

*హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణయ్ బాబుని అభినందించిన గ్రామస్తులు

చిత్రం న్యూస్, హుజురాబాద్:

కాంగ్రెస్ యువనేత, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణయ్ బాబు తుమ్మనపల్లిలో దశాబ్దాల కలను నెరవేర్చారు. సొంత ఖర్చులను వెచ్చించి శ్మశానవాటిక నిర్మాణానికి  స్వీకారం చుట్టారు.  గ్రామంలో చాలా కాలంగా శ్మశానవాటిక లేకపోవడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రణయ్ బాబు స్వయంగా రంగంలోకి దిగారు. తాజాగా గ్రామస్తులు వినతిపత్రం అందించగా స్పందించిన ప్రణయ్ బాబు స్థానిక పరిస్థితులను ప్రత్యేకంగా పరిశీలించారు. అనంతరం ఆలస్యం చేయకుండా  శ్మశానవాటిక నిర్మాణానికి సొంత ఖర్చుతో పనులు శ్రీకారం చుట్టారు. ప్రణయ్ బాబు తీసుకున్న ఈ నిర్ణయానికి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు,  ప్రణయ్ బాబు మాట ఇచ్చిన వెంటనే పనులు ప్రారంభించడం గౌరవంగా అనిపిస్తుందని, ఇలాంటి నాయకుడు మాకు ఇప్పటివరకు కనిపించలేదు అంటూ  ప్రశంసలు కురిపించారు. గ్రామ అభివృద్ధికి ప్రణయ్ బాబు చేసిన  కృషికి స్థానికుల నుంచి మంచి ఆదరణ పొందాడు.

మెగా డీఎస్సీ నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ

0

మెగా డీఎస్సీ నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ

చిత్రం న్యూస్,అమరావతి :

జూన్ 6 నుంచి ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ పరీక్షలు యథాతథంగా జరగనున్నాయి. మెగా డీఎస్సీ నిలుపుదల కోరుతూ వేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. డీఎస్సీ పరీక్షలపై స్టే కోరుతూ వేసినఅమరావతి అనుబంధ పిటిషన్లనూ కొట్టేసింది. హాల్ టికెట్లు ఇచ్చామని, పరీక్షలకు ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం పెట్టిన సమయానికి పరీక్షలు జరగనున్నాయి.

కాకినాడను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం 

0

కాకినాడను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం 

  • *ఎంపీ సానా సతీష్ బాబు

చిత్రం న్యూస్, కాకినాడ:  కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా కొప్పవరంలోని ఎంపీ సానా సతీష్ బాబు క్యాంపు కార్యాలయంలో టీడీపీ, బీజేపీ జిల్లా నాయకుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే వర్మలు మాట్లాడారు. ఎన్నికల్లో ప్రకటించిన విధంగా కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందన్నారు. వెన్నుపోటు పేరుతో జగన్ రెడ్డి పార్టీ నిరసన చేయడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేసారు. వచ్చే నాలుగేళ్లలో కాకినాడ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎంపీ సానా సతీష్ బాబు వెల్లడించారు.

సిలిండర్ ఆటో ట్రాలీని ఢీ కొన్న ఆయిల్ ట్యాంకర్ లారీ

0

సిలిండర్ ఆటో ట్రాలీని ఢీ కొన్న ఆయిల్ ట్యాంకర్ లారీ

*త్రుటిలో తప్పిన ప్రమాదం. 

చిత్రం న్యూస్, హుజురాబాద్:

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. గ్యాస్ సిలిండర్ లతో వెళ్తున్న ట్రాలీ ఆటో ని వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకరు మండలంలోని సింగపూర్ గ్రామ శివారులో ఢీ కొట్టింది. దీంతో ట్రాలీ నడిరోడ్డు మీద బోల్తా కొట్టింది .అందులో ఉన్న గ్యాస్ సిలిండర్లు చెల్లాచెదురయ్యా యి. కొన్ని సిలిండర్లు లీక్ అయ్యాయి ట్యాంకర్ డ్రైవరు తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేయగా ట్యాంకర్ టైర్ కింద ఇరుక్కుపోయింది  ట్రాలీ ఆటోలో ఉన్న ఇద్దరికీ స్వల్ప గాయాలు కాగా స్థానికులు 108 ద్వారా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. త్రుటిలో ప్రాణాపాయం తప్పడంతో ఒకసారిగా వాహనదారులు, ప్రయాణికులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.