Home Blog Page 83

ప్లాస్టికేతర వస్తువులనే ఉపయోగించాలి

 ప్లాస్టికేతర వస్తువులనే ఉపయోగించాలి

ఏఐసీసీ విచార్ విభాగ్ రాష్ట్ర కోఆర్డినేటర్ తుల అరుణ్

చిత్రం న్యూస్, సొనాల:

పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టికేతర వస్తువులనే ఉపయోగించాలని ఏఐసీసీ విచార్ విభాగ్ రాష్ట్ర కోఆర్డినేటర్ తుల అరుణ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా సొనాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్లాస్టికేతర బ్యాగులనే వాడాలంటూ వారసంతలో అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ రహిత బ్యాగులను పంపిణీ చేశారు  ఈ సందర్భంగా తుల అరుణ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ అనే భూతం పర్యావరణాన్ని, నాశనం చేస్తూ, కాలుష్య కారినిగా తయారైందని  ప్లాస్టిక్ వాడకంతో నీరు భూమిలో ఇంకకుండా పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తుందని, అదేవిధంగా క్యాన్సర్ కారకంగా పనిచేస్తుందన్నారు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలన్నారు.  కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాజుల పోతన్న, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రమేష్ బత్తుల, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు చెట్ల పెళ్లి అనిల్,   పీఏసీఎస్ డైరెక్టర్ పోశెట్టి, ఏఎంసీ డైరెక్టర్, ఇస్రూ పటేల్, బీసీ సెల్ ఛైర్మన్ జంగాల భోజన్న , కసిరే పోతన్న, మాజీ సర్పంచ్, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా వినాయక ఆలయం 8వ వార్షికోత్సవం

ఘనంగా వినాయక ఆలయం 8వ వార్షికోత్సవంఆ

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీ రేణుకా అపార్టుమెంటు లోని వినాయక ఆలయం 8వ వార్షికోత్సవాన్ని ఘనంగా కాలనీవాసులు ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి గణపతి పూజ, కలశ పూజ, నవగ్రహ పూజ, యజ్ఞ, హోమాది కార్యక్రమాలను చేపట్టారు. లోక ప్రవీణ్ రెడ్డి దంపతులతో పాటు అపార్టుమెంటు లో నివసించేవారు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆలయ వార్షికోత్సవంలో వినోద్, మేయూర్, సందీప్ రెడ్డి, సునీల్, అనిల్ రావు,  ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పర్యటన

బైక్ పై తిరుగుతూ పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: ప్రకృతి కన్నెర్ర చేయడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న పంటలు నీట మునగడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రైతులు అధైర్యపడవద్దని అన్ని విధాల ఆదుకునేలా ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. అటు అధికారులు సైతం గుంట భూమిని కూడా వదలకుండా నష్టపోయిన ప్రతి భూమిలో సర్వేలు నిర్వహించి, త్వరితగతిన నివేదికలు సమర్పించాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో గత మూడు రోజులుగా విస్తృతంగా ఎమ్మెల్యే పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం జైనథ్ మండలంలోని పెండల్వాడ, బాలపూర్, సాంగ్వి, కౌఠ తదితర పెన్ గంగా నది పరివాహక గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులను వెంటబెట్టుకొని పర్యటించారు. ఈ సందర్భంగా స్వయంగా తానే బైక్ నడుపుతూ నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి, రైతులతో మాట్లాడి వారికి ధైర్యాన్ని కల్పించారు.

అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ..భారీ వర్షాలతో దాదాపు 20 నుండి 22 వేల ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా ఉందన్నారు. ప్రస్తుతం రైతుకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని, రైతులెవ్వరు అధైర్యపడవద్దని తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. రైతులు సాగు పెట్టుబడికి తెచ్చిన అప్పులు బ్యాంకు రుణాలను వెసులుబాటు చేయాల లేదా రీ షెడ్యూల్ చేయాలా అనే అంశాలపై ప్రభుత్వంతో చర్చిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట పలువురు వ్యవసాయ శాఖ అధికారులు,  బీజేపీ నాయకులు లోక కరుణాకర్ రెడ్డి, ఎల్టి అశోక్ రెడ్డి, విజయ్, ఉల్లాస్ రెడ్డి, నరేష్, రాందాస్, రమేష్, శ్రీకాంత్, రాకేష్, వైభవ్, సంతోష్, సూర్యరెడ్డి  తదితరులు ఉన్నారు.

పేదల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న  బోరంచు శ్రీకాంత్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: భారతదేశ సాంకేతిక పరిజ్ఞానానికి నాంది పలికి, అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశానికి అతి పిన్న వయసులో ప్రధానమంత్రిగా సేవలందించిన ఆధునిక నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. సాంకేతిక టెక్నాలజీ విప్లవం ద్వారా భారత దేశాన్ని ఐటీ, టెలికాం, అంతరిక్ష పరిశోధన రంగాలలో ప్రపంచంలో భారత దేశాన్ని అగ్రగామిగా నిలిచేందుకు కృషిచేశారని తెలిపారు. ఆయన పాలనలో పేదరిక నిర్మూలనకు అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారని అన్నారు. యువతకు స్ఫూర్తి ప్రధాతగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో యువత పయనించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మావల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, మాజీ కో -ఆప్షన్ మెంబర్ రహీమ్ ఖాన్, ఎన్ఎస్ యూఐ మండల అధ్యక్షులు మర్సుకోలా గౌతమ్, మాజీ కౌన్సిలర్ ముర్తుజా,మాజీ టౌన్ అధ్యక్షులు వసీం, సీనియర్ నాయకులు అలీమ్, కొరటి ప్రభాకర్, ఎండీ ఆఫ్సర్, ముత్యాల మహేందర్, ప్రజ్ఞషిల్, షేక్ రహీమ్, ఆఫ్సర్ ఖాన్, రెండ్ల రాజన్న, దినేష్ అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.

పిప్పల్ కోటి భూనిర్వాసితులకు తక్షణం నష్టపరిహారం చెల్లించాలి

రిజర్వాయర్ లో కోల్పోయిన భూములను పరిశీలిస్తున్న సీపీఎం జిల్లా బృందం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: పిప్పల్ కోటి రిజర్వాయర్ పేరుతో సేకరించిన 1200 ఎకరాల్లో కేవలం 180 ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం చెల్లించి మిగితా 1020 ఎకరాలకు నష్టపరిహారం చెల్లించలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సీనియర్ నాయకుడు బండి దత్తాత్రి తెలిపారు. భూనిర్వాసిత రైతులతో కలిసి బుధవారం పిప్పల్ కోటి రిజర్వాయర్ లో కోల్పోయిన భూములను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ పిప్పల్ కోటి రిజర్వాయర్ నిర్మాణం పేరుతో 2018 సంవత్సరంలో 1200 ఎకరాల సాగుభూములను సేకరించారని,అందులో కేవలం 180 ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం చెల్లించారని తెలిపారు. మిగిలిన రైతులకు నష్టపరిహారం ఎకరాకు 8 లక్షలు నిర్ణయించినప్పటికీ ఏడేండ్లు గడుస్తున్నా నష్టపరిహారం చెల్లించక పోవడంతో రైతులు ఇబ్బందులు ఎందుర్కొంటున్నారని పేర్కొన్నారు. రైతులు భూమిని సాగుచేసుకోలేక ,అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెరిగిన భూమి విలువకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం ఏ మాత్రం సరిపోదు అన్నారు.ఆ డబ్బులతో రైతులు మరో చోట భూమిని కొనుక్కోలేని విదంగా భూముల రేట్లురెట్టింపు అయ్యాయన్నారు. రిజర్వాయర్ పనులు సైతం నత్త నడకన నడుస్తున్నాయని చెప్పారు. మూడేళ్లలో  పూర్తికావాల్సిన పనులు ఏడేండ్లుఅయిన పూర్తికాక పోవడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందన్నారు. గత పాలకులతో పాటు ఏడాదిన్నర పూర్తి చేసుకున్న ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. వెంటనే రైతులకు నష్టపరిహారం రెట్టింపు చేసి చెల్లించాలని ,రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఆర్.మంజుల, సీఐటీయూ నాయకులు అగ్గిమల్ల స్వామి ,పండుగ పొచ్చన్న మహిళా నాయకులు అరీఫా బేగం ,గంగాసాగర్ ,గ్రామ కార్యదర్శి ధొనిపెల్లి స్వామి , రైతులు నసీరుద్దీన్ ,పెంటన్న తదితరులున్నారు .

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

0

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్ర పటానికి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ టౌన్:  భారతరత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను  బుధవారం కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రజా భవన్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  లోక ప్రవీణ్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ దిగంబర్ రావు పాటిల్, నాయకులు నగేష్, గిమ్మ సంతోష్ రావు, డేరా కృష్ణారెడ్డి, షకీల్, శ్రీలేఖ ఆదివాసీ తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ కులాల, సంచార తెగల ఆత్మీయ సమావేశం

0

ఎస్సీ కులాల, సంచార తెగల ఆత్మీయ సమావేశం

*మాట్లాడుతున్న జాతీయ కన్వీనర్ శ్యాం ప్రసాద్ జీ

చిత్రం న్యూస్, రంగారెడ్డి: సామాజిక సమరసత వేదిక, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సంయుక్త నిర్వహణలో భాగ్యనగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన సమావేశం మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు సికింద్రాబాద్ లోని గీతా భవన్ లో నిర్వహించారు. 21 కులాలకు చెందిన 55 మంది పాల్గొన్నారు. ప్రతి కులం నుండి ఒకరినీ సన్మానించారు. మనము, ఎస్సీ కులస్తులు సోదరులమనే భావనతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భారత రాజ్యాంగం మేరకు తెలుగు రాష్ట్రాలలో ఎస్సీ జాబితాలో 59 కులాలు ఉన్నాయి, ప్రతి కులానికి ఒక కుల దేవత, చరిత్ర ఉంది. 75 సం,ల రాజ్యాంగం అమలులో అభివృద్ధి ఫలాలు అన్ని ఎస్సీ కులాలకు సమంగా చేరలేదని, దీనికి అనేక కారణాలు ఉన్నాయని, ఎస్సీలకు చెందిన అన్ని కులాలవారికీ, అందరి ప్రగతి కోసం కలసి మెలసి పని చేయాలనన్నారు. రాజకీయాలు అవసరమే! అయితే రాజకీయాలు మాత్రమే అనుసరిస్తే అవి ప్రజలను విడదీస్తాయని, ధర్మ,సంస్కృతులు మాత్రమే ప్రజలను సమైక్యం చేస్థాయని” శ్రీ శ్యామ్ ప్రసాద్ జీ, జాతీయ కన్వీనర్ తమ ప్రస్తావనలో పేర్కొన్నారు.అలాగే ఎస్సీ కులాలకు, మిగతా కులాల మధ్య అంతరాల గురించి ప్రశ్నించే వాళ్ళు వివిధ ఎస్సీ కులాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో ఒకసారి సమీక్ష చేసుకోవాలని శ్రీ శ్యామ్ జీ గుర్తు చేశారు. మన అందరి మధ్య మరింతగా సద్భావం, సోదర భావం పెరగడానికి మనం ఏమేమి చేయగలమో అభిప్రాయాలను తెలపాలని తెలంగాణ కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తెలిపారు. ఈ చర్చలో పలువురు ప్రముఖులు ప్రసంగించారు.

మనం ఎస్సీలం మాత్రమే కాదు హిందువులము కూడా!

అరుంధతి మాత హిందువుల అందరికీ ఆదర్శ స్త్రీ, వివాహం అనంతరం అన్ని కులాలకు చెందిన కొత్త దంపతులు వశిష్ట- అరుంధతి నక్షత్రాలు చూస్తారు కదా! 17 వ శతాబ్దంలో తమిళనాడులోని శివగంగకోట పై ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని ఎదిరిస్తు ఆత్మ బలిదానం చేసిన యువతి *కుయిలి* ఎస్సీ మహిళయని శ్రీ సత్యనారాయణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముగింపు సమావేశంలో ప్రసంగించారు. భాగ్యరెడ్డి వర్మ మనువడు శ్రీ అజయ్ గౌతమ్ దంపతులు పాల్గొని, భాగ్యరెడ్డి వర్మ గారి సేవా కార్య క్రమాలను గుర్తుచేశారు.సమావేశ నిర్వాహణను డా,వెంకట నరసయ్య, సీనియర్ శాస్త్రవేత్త IICT చేశారు. కార్యక్రమంలో శ్రీ మారేడు మోహన్ ( రాష్ట్ర అధ్యక్షులు, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి), శ్రీ వేణుగోపాల్, సమరసత తెలంగాణ సహా కన్వీనర్, శ్రీ చిరంజీవి, రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ సంచార తెగల సంఘం పాల్గొన్నారు. కొంపల్లి అరవింద్, ప్రతాప్, వేముల శ్యామ్ తదితరులు కార్యక్రమ నిర్వహణలో తమ పాత్ర పోషించారు.

వరదలపై అధికారులతో సమీక్ష.. పంటలు పరిశీలన

నష్టం అంచనా వేసి సమగ్ర నివేదిక అందించాలి

*ఉమ్మడి జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: భారీ వర్షాల కారణంగా వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉమ్మడి ఆదిలాబాద్ ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. తాజా వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టం, సహాయక చర్యలపై పెన్ గంగా గెస్ట్ హౌజ్ లో అధికారులతో మంత్రి సమీక్షించారు. చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులకు తగిన సూచనలు చేస్తూ, వరద నష్టంపై శాఖల వారీగా సమగ్రమైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆ నివేదికను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ఆ మేరకు నిధులు కేటాయించాలని కోరతానని తెలిపారు. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా వెంటనే సహాయక చర్యలు చేపట్టాలన్నారు. చెరువులు, కుంటలు, కాల్వలకు గండ్లు పడ్డ చోట యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. దెబ్బతిన్న రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేయాలని, విద్యుత్ సరఫరాలో తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు. వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అంతకుముందు ఇటీవల బోరజ్ మండలం తరోడా వద్ద వంతెన దాటుతూ లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన లాండే దత్తు కొట్టుకుపోయి మృతి చెందడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైనా రూ.5లక్షల చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు అందించారు. అనంతరం ఆదిలాబాద్ గ్రామీణ మండలం అంకోలి, తంతోలి గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జు,ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ రాజర్శి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా తదితరులు ఉన్నారు.

ఎకరానికి రూ.50 వేలు నష్ట పరిహారం చెల్లించాలి

*భీంపూర్ మండలం పిప్పల్ కోటిలో పంటలు, ఇండ్లు పరిశీలించిన సీపీఎం బృందం

సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్, బ్యూరో: జిల్లాలో భారీ వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారికి ఎకరానికి రూ.50వేల చొప్పున నష్టపరిహారం అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సీనియర్ నాయకులు బండి దత్తాత్రి డిమాండ్ చేశారు. మంగళవారం భీంపూర్ మండలం పిప్పల్ కోటి గ్రామంలో నీట మునిగిన పంటలు, దెబ్బతిన్న ఇండ్లను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో ఇప్ప సంతోష్ అనే కౌలు రైతు 14 ఎకరాల భూమిలో 25 పత్తి సంచుల విత్తనాలు వేశారని,  ఇప్పటివరకు ఐదు లక్షల యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టారని తెలిపారు. పంట చేతికి వస్తే పదమూడు లక్షల రూపాయలు వరకు దిగుబడి వచ్చేదని పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా పూర్తిగా నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో రైతు తొనుపు స్వామి నాలుగు ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా పూర్తిగా నీట మునిగిందన్నారన్నారు.ఇలా పిప్పల్ కోటిలో రెండు వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే ఎకరాకు యాభై వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలన్నారు.   గ్రామంలో ఇండ్లలోకి నీరువచ్చి నష్టపోయిన బాధిత కుటుంబాలను ఇంటింటికీ తిరిగి పరామర్శించామని పేదల తిండిగింజలు, నిత్యావసర సరుకులు నీట మునిగి నష్టపోవడమే కాక ఇండ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. కొందరి ఇండ్లు కూలిపోయాయని వివరించారు. వెంటనే ప్రతి కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ. 25వేలు అందించాలని, అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. నష్టపోయిన బాధితుల జాబితాను జిల్లా కలెక్టర్ కు అందజేస్తామని బాధితులకు న్యాయం జరిగే వరకు సీపీఎం పోరాటం చేస్తుందని తెలిపారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఆర్. మంజుల, మహిళా సంఘం నాయకులు గంగసాగర్, అరిఫా బేగం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అగ్గిమల్ల స్వామి, జిల్లా నాయకులు పండుగ పాచ్చన్న, గ్రామ శాఖ కార్యదర్శి ధోనిపెల్లి స్వామి, గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి

ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి

చిత్రం న్యూస్, బేల: ఏకదాటిగా కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని ఖోగ్దూర్ ,మాoగ్రుడ్ గ్రామాలలో మంగళవారం మండల నాయకులతో కలిసి పంట నష్టపోయిన రైతుల చేలను పరిశీలించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  బీఆర్ఎస్  నాయకులు మస్కె తేజరావు, యువ నాయకుడు సతీష్ పవార్,  ఠాక్రే మంగేష్, విశాల్ గోడే,  మనోజ్ గేడామ్, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.*