Home Blog Page 82

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

0

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

చిత్రం న్యూస్, నేరడిగొండ: అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన  కుమారి గ్రామంలో  చోటుచేసుకుంది  నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్ ఖాన్ , తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కుమారి గ్రామానికి చెందిన పోతగంటి లస్మన్న (38) ఈ మధ్య కురిసిన భారీ వర్షాల కారణంగా తనకున్న మూడు ఎకరాలు పూర్తిగా నీటమునిగి పోయాయి. అప్పులు ఎక్కవగా ఉండడంతో ఇక పంట నష్టం జరిగిందని మనస్థాపానికి గురై తన ఇంట్లోనే ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లస్మన్నకు ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు.

 

ఉల్లాస్ (అక్షర ఆంధ్ర) శిక్షణా తరగతులు

0

ఉల్లాస్ (అక్షర ఆంధ్ర) శిక్షణా తరగతులు

చిత్రం న్యూస్, సామర్లకోట: నిరక్షరాస్యులను గుర్తించి వారిని అక్షరాస్యులుగా మార్చుటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అక్షరాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా మండలానికి వచ్చే 1000 మంది లెర్నర్స్ ను గుర్తించి వారిని అక్షరాస్యులుగా మార్చుట కోసం ఉల్లాస్ (అక్షర ఆంధ్ర) శిక్షణా తరగతులను వాలంటీర్లకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం సామర్లకోట మండలంలో  గురువారం మధ్యాహ్నం 2 గం.టలకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో కె.హిమమహేశ్వరి, మండల విద్యాశాఖాధికారి శ్రీ వై.శివరామ కృష్ణయ్య, APM జగదీశ్వరి, పి.పనయ్య -Deputy Director ,Adult Education, అనిశెట్టి వెంకటరావు, Nodal Officer, Eastgodavari, వి.సునీల్ ఆనంద్ బాబు, Statistical Assistant (i/c) , Samalkot R/U , పి.రాజేష్, Statistical Assistant, Adult Education, Kakinada, యం.నాగేశ్వరరావు , PS HM ,Samalkot U-RP , డి. వీరన్న, SGT, Samalkot U-RP, యస్.రాజు. SGT, Samalkot U-RP తదితరులు పాల్గొన్నారు.

నష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తాం_ డీసీసీబీ చైర్మన్  అడ్డి భోజారెడ్డి

 నష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తాం_ డీసీసీబీ చైర్మన్  అడ్డి భోజారెడ్డి

చిత్రం న్యూస్,బేల ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను ఆదిలాబాద్ జిల్లా డిసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. మండలంలో మనియార్ పూర్, గూడ గ్రామంలో భారీ వర్షాలు, వరదలతో నీట మునిగి నష్టపోయిన పంటలను పరిశీలించి ఎంతమేరకు నష్టం వాటిల్లిందో రైతులను అడిగి తెలుసుకున్నారు. ఆరుగాలం కష్టపడి పంటలను కంటిరెప్పలా కాపాడితే భారీ వర్షాలు, వరదలకు నీళ్ళ పాలయిందని నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని పలువురు రైతులు చైర్మన్ ని కోరారు.ఈ సందర్బంగా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తు వల్ల మండలంలో వేల ఎకరాల్లో పత్తి, సోయా, కంది పంటలు చాలా వరకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించడం జరిగిందన్నారు. రైతులు ఎవరూ కూడా అధైర్యపడొద్దని , కాంగ్రెస్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో ముందుకు వచ్చిందని చెప్పారు. వరద బాధితులకు అన్ని విధాలా సహాయం అందిస్తామని జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణ రావ్ చెప్పారన్నారు. అయితే గతంలో ఉన్న ప్రభుత్వం భారీ వర్షాలు, వరదలకు నష్ట పోయిన రైతులకు ఎప్పుడు పరిహారం ఇవ్వలేదని కానీ ఇప్పుడు ఉన్న ప్రతిపక్ష నాయకులు రైతుల తరపున మాట్లాడం చాలా విడ్డురంగా ఉందన్నారు. త్వరలో వ్యవసాయ అధికారులతో సర్వే చేపట్టి నివేదిక అందిన వెంటనే రైతులకు పరిహారం అందజేయడం జరుగుతుందని రైతులకు భరోసా నిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ విస్తరణ అధికారి వినయ్ కుమార్,మండల మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే, కాంగ్రెస్ పార్టీ యూత్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల కిసాన్ సెల్ అధ్యక్షులు ఘన్ శ్యామ్, సీనియర్ నాయకులు సంతోష్, సాగర్, విపిన్, అవినాష్, సూర్యభాన్, కరీం తదితరులు పాల్గొన్నారు.

సొనాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ  చేసిన  డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్

సొనాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ  చేసిన  డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్

చిత్రం న్యూస్, సొనాల : ఆదిలాబాద్ జిల్లా సొనాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా మలేరియా అధికారి డా.శ్రీధర్ తో కలిసి  డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ తనిఖీ చేశారు. ఆస్పత్రిలో పలు రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని, సమయపాలన పాటించాలని సూచించారు. ఆసుపత్రిలో ఓపి విభాగంలో ఎక్కువగా కేసులు నమోదవుతున్న గుట్ట పక్క తండా, గుర్రాల తండా గ్రామాలలో శానిటేషన్ పరిశీలించి ఫీల్డ్ సిబ్బందికి తగు సూచనలు చేశారు. మండల కేంద్రంలోని ఆర్ఎంపీ కేంద్రాలను పరిశీలించారు. ఆర్ఎంపీలు ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలని, అర్హతకు మించి వైద్యం చేయరాదన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నవీన్ రెడ్డి, సూపర్వైజర్ కవిత, హెల్త్ అసిస్టెంట్ లింగారెడ్డి, ఏఎన్ఎం అనసూయ, ఆశా కార్యకర్తలు ఉన్నారు.

శాశ్వత పోస్టులు భర్తీ 

           శాశ్వత పోస్టులు భర్తీ 

చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా కొత్తగా ఏర్పడిన సొనాల మండల  తహసీల్దార్ కార్యాలయంలో క్యాడర్ పూర్తి స్ట్రెంత్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాంక్షన్ చేసిన సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు తహసీల్దార్, సిబ్బందికి శాలువా తో సత్కరించి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ..కొత్త మండలంలో అన్ని శాశ్వత పోస్టులు భర్తీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా కు ధన్యవాదాలు తెలిపారు. సొనాల మండలం మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కాబట్టి రక్షణ కోసం  పోలీస్ స్టేషన్ ను త్వరలో ఏర్పాటుచేయాలని ఆశాభావం  వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాజుల పోతన్న, కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ రమేష్ బత్తుల, పట్టణ అధ్యక్షులు చెట్లపెళ్లి అనిల్, రామాయి రాము, కసిరే పోతన్న, బాశెట్టి సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.

పారిశుధ్య కార్మికులకు సన్మానం

0

 పారిశుధ్య కార్మికులకు సన్మానం

చిత్రం న్యూస్, గజ్వేల్: ఎస్సీలకు చెందిన అన్ని కులాల వారు కష్ట కాలంలో, శుభ కార్యక్రమాల్లో కలసి మెలసి ఉండాలని,  మనం ఎస్సీలు కాదు హిందువులమని సామాజిక సమరసత వేదిక జాతీయ కన్వీనర్ శ్యాంప్రసాద్ జీ  అన్నారు. హిందువులందరి మధ్య బంధు భావన నిర్మాణం కోసం సామాజిక సమరసత వేదిక దేశ వ్యాప్తంగా పని చేస్తోందని శ్యామ్ ప్రసాద్ జీ వివరించారు. సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో 21 ఆగస్టున ప్రజ్ఞాపూర్ లోని ప్రముఖ దంత వైద్యులు, జిల్లా దంత వైద్యుల అసోసియషన్ అధ్యక్షులు డా.శ్రీధర్ ఇంట్లో జరిగిన సమావేశానికి డా,ఆకుల నరేష్ బాబు అధ్యక్షత వహించారు. ఈ ఆత్మీయ సమావేశంలో ఎస్సీలకు చెందిన నాల్గు కులాల వారు పాల్గొన్నారు. బైండల,చిందు కులాలకు చెందిన వారు పాటలు పాడారు. వారికి మాదిగ,మాల కులస్తులకు చెందిన పారిశుధ్య కార్మికులకు సన్మానం చేశారు. తరువాత కలసి సామూహిక భోజనం చేశారు. ఎస్సీ కులాల వారు ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్లాలని, ఆడ పిల్లలను మగ పిల్లలతో సమానంగా చూడాలని, వారిని బాగా చదివించాలని కోరారు. విద్యార్థి విభాగం ప్రముఖ్ శ్రీ కృష్ణ, అడ్వకేట్ శ్రీకాంత్ పారిశుధ్య కార్మికుల ఆర్థిక,సామాజిక స్థితి గతులపై సర్వే చేశారు.తెలంగాణ కన్వీనర్  అప్పాల ప్రసాద్, డా.శ్రీధర్, డా.సాయినాధ రెడ్డి, డా. శివకుమార్ ఇతరులు పాల్గొన్నారు.

కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలి

కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి అన్నారు. గురువారం విద్యార్థులకు చేయూత కార్యక్రమం లో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని పిట్టల వాడ కాలనీ లోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకి స్కూల్ బ్యాగ్స్, బుక్స్ అందజేసి విద్యార్థుల తల్లితండ్రులను సన్మానించారు. అంతకు ముందు పాఠశాలకు విచ్చేసిన మౌనిష్ రెడ్డి కి విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజిని, ఉపాధ్యాయులు సుష్మరాణి, గీత, మాజీ సర్పంచ్ రాజన్న, యోగేష్ తదితరులు పాల్గొన్నారు.

పబ్జీ గేమ్ కు బానిసై విద్యార్థి ఆత్మహత్య

0

*భైంసా లోని ఆనంద్ నగర్ లో విషాద ఘటన

చిత్రం న్యూస్, భైంసా:  ఫోన్ లో పబ్జీ గేమ్ కు బానిసై విద్యార్థి ప్రాణాలు తీసుకున్న ఘటన నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆనంద నగర్ కాలనీలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. హైదరాబాదు మౌలాలి ప్రాంతానికి చెందిన బేతి సంతోష్- సాయిప్రజ దంపతులు గత కొంతకాలంగా బైంసా లోని ఆనంద్ నగర్ కాలనీలోని నివాసం ఉంటూ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరికి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. కుమారుడు బేతి రిషేంద్ర (13)  హైదరాబాదులో బాష్యం స్కూల్లో 9వ తరగతి పూర్తి చేసుకుని పదవ తరగతి లో చేరాల్సి ఉండగా కొంతకాలంగా పబ్జీ గేమ్ కు బానిస అయ్యాడు. పదో తరగతి కోసం పాఠశాలలకు వెళ్లకుండా ఇక్కడే ఉండి పోయాడు. మార్పు తెచ్చి చదువుపై దృష్టి పెట్టేందుకు చివరి ప్రయత్నంగా గత రెండు మూడు రోజులుగా కుమారుడికి కుటుంబీకులు పబ్జీ గేమ్ ఆడకుండా కట్టడి చేసినట్లుగా తెలిసింది. దీంతో డిప్రెషన్ లోకి వెళ్ళిన విద్యార్థి  బుధవారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భైంసా పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్ట్ మార్టం కోసం  మృతదేహాన్ని  ఏరియా ఆస్పత్రి కి తరలించారు.

పంటకు బీమా ఉంటేనే రైతులకు ధీమా

* పరామర్శలు కాదు రైతులకు భరోసా కల్పించాలి

*ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో: రైతులు సాగు చేసే పంటలకు బీమా ఉంటేనే రైతులు ధీమాగా వ్యవసాయం చేసే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఇలాంటి విపత్కర సమయాల్లో పాలకుల పరామర్శ కాకుండా మానవతా దృక్పథంతో రైతులకు భరోసా కల్పించాలని ఆయన వెల్లడించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను విస్తృతంగా పరిశీలించిన ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులకు రూ.10వేలు ఇస్తే ఎలాంటి లాభం లేదని మిగతా విత్తనాలను సబ్సిడీలో అందించాలని సూచించారు. అదేవిధంగా కోతకు గురైన భూములను చదును చేసుకునేందుకు ఎన్ఆర్ఈజీఎస్ ను అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పై భారం పడకుండా ఉండేదని తెలిపారు. రైతులకు సైతం ఇలాంటి ఇబ్బందులు తప్పేవని అన్నారు. ఇప్పటికే రైతులు 70 నుండి 80 శాతం వరకు పెట్టుబడులు పెట్టారని, సర్వం కోల్పోయిన రైతులను ఆదుకోవాలని పేర్కొన్నారు. ఇలాంటి ప్రకృతి విపత్తుల సమయంలో శాశ్వత పరిష్కారానికై చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు జోగు రవి, లాలా మున్నా, ఆకుల ప్రవీణ్, దినేష్ మటోలియా, సంతోష్, రాకేష్, దయాకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

గణేష్‌ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి

గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి_కలెక్టర్ అభిలాష అభినవ్

చిత్రం న్యూస్, భైంసా: గణేష్ ఉత్సవాలు సోదరభావంతో,శాంతియుతంగా జరుపుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ కలెక్టరేట్‌లో ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పీస్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మండపాల వద్ద కచ్చితంగా నిఘా ఏర్పాటు చేయాలని, అసాంఘిక కార్యకలాపాలకు చోటు ఉండకూడదన్నారు. మద్యం తాగి మండపాల వద్ద ఉండరాదని, డీజేలు, లౌడ్ స్పీకర్లతో ఇతరులకు ఇబ్బందులు కలగకుండా మండపాల నిర్వాహకులు తగిన ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శోభాయాత్ర సమయంలో కచ్చితంగా విద్యుత్తు సరఫరాతో పాటు తగు సూచనలు, సలహాలు కచ్చితంగా పాటించాలన్నారు. విభాగాలన్నీ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఏ ఎస్పీలు అవినాష్ కుమార్, రాజేష్ మీనా, సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.