గిరిజన యువతులకు ఉచిత కుట్టు శిక్షణ
చిత్రం న్యూస్,తలమడుగు: తలమడుగు మండలం పల్సీ(కే) గ్రామంలో 30 మంది గిరిజన మహిళలు యువతులకు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ ఇస్తున్నట్లు ఆ క్లబ్ అధ్యక్షుడు మంద అశోక్ తెలిపారు. శుక్రవారం ఆ గ్రామంలో ఉచిత శిక్షణ కేంద్రాన్ని సభ్యులతో కలిసి ఆయన ప్రారంభించాడు. ఆరు నెలల శిక్షణ ఇవ్వడంతో పాటు శిక్షణ అనంతరం కుట్టుమిషన్ సైతం అందించేలా కృషి చేస్తామన్నారు. రెండు మిషన్లతో పాటు రూ. 2 వేల విలువైన కుట్టు సామాగ్రి అందజేసి శిక్షణ ఇచ్చేందుకు ఇద్దరు శిక్షకులను నియమించామన్నారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి భగవాన్ దాస్, ఉపాధ్యక్షులు ప్రేమ్ రాజ్ గౌడ్, ప్రకాష్ బండారు దేవన్న దయాకర్ రెడ్డి కరీం అలీ నూరాని, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సున్నరేందర్ యాదవ్, మాజీ సర్పంచ్ నైతం పాయల్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
గిరిజన యువతులకు ఉచిత కుట్టు శిక్షణ
అల్లూరిని వారసత్వంగా తీసుకుని సమాజ రుగ్మతలపై పోరాటాలు చేయాలి
*సీపీఐ పెద్దాపురం పట్టణ మహాసభలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు
చిత్రం న్యూస్, పెద్దాపురం: అల్లూరిని వారసత్వంగా తీసుకొని సమాజ రుగ్మతలపై పోరాటాలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు అన్నారు . శుక్రవారం ఉదయం స్థానిక పెద్దాపురం హమాలి యూనియన్ కార్యాలయంలో పెద్దాపురం 18వ పట్టణ మహాసభ వై. రామకృష్ణ అధ్యక్షతన జరిగింది అంతకుముందు మన్యం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి తాటిపాక మధుతో పాటు జిల్లా కార్యదర్శి కె. బోడకొండ, పి సత్యనారాయణ లు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ మహాసభ సందర్భంగా పెద్దాపురం మరిడమ్మ గుడి నుండి కాంప్లెక్స్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న మధు మాట్లాడుతూ..దేశంలో బ్రిటిష్ వలసపాలన అంతానికి దేశ స్వాతంత్ర్య సముపార్జనకు మొక్కవోని దీక్షతో ఎనలేని ధైర్యసాహసాలతో పోరాడి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ధీరుడు అల్లూరి సీతారామరాజు అన్నారు. చింతపల్లి, నర్శీపట్టణం,విశాఖ మన్యం ప్రాంతాల్లో అమాయక గిరిజనులను దోచుకుంటున్న బ్రిటీష్ అధికారుల అరాచకాలకు వ్యతిరేకంగా గిరిజనులను చైతన్య పరచి వారికి యుద్ధ విద్యలు నేర్పించి గెరిల్లా యుద్ధపద్ధతుల్లో బ్రిటిష్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు సాగించిన విప్లవయోధుడు అల్లూరి అన్నారు. బ్రిటిష్ పాలన అంతం కావాలని తదనంతరం దేశంలో పేదరికం, దారిద్య్రం,దోపిడీ, అసమానతలు లేని స్వపరిపాలన కాంక్షతో 27 ఏళ్ళ వయస్సులోనే తన ప్రాణాలను బ్రిటిష్ తుపాకీ గుళ్ళకు అర్పించారన్నారు. అల్లూరి ఆశించిన సమాజ స్థాపనకు పూనుకోవడమే మనం అల్లూరికి అర్పించే నిజమైన నివాళి అని ఆయన ఆశయాలకు నేటి యువత ముందుకురావాలని మధుపిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శి కే. బోడకొండ మాట్లాడుతూ.. ఈనెల ఐదున జరిగే సీపీఐ రాష్ట్రవ్యాప్త నిరసనలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు .సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈనెల 16, 17 తేదీలలో సామర్లకోటలో జరిగే కాకినాడ జిల్లా జిల్లా మహాసభలను అన్ని వర్గాల వారు జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరo పెద్దాపురం పట్టణ కార్యదర్శిగా వై రామకృష్ణ తో పాటు మరో 7 గురు కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు .ఈ సమావేశములో పార్టీ నాయకులు త్రిమూర్తులు, వెంకట్రావు తదితరులు ప్రసంగించారు
ఘనంగా మాజీ మంత్రి జోగు రామన్న జన్మదిన వేడుకలు
ఘనంగా మాజీ మంత్రి జోగు రామన్న జన్మదిన వేడుకలు
*అడానేశ్వర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 500 మంది విద్యార్థులకు నోటుబుక్ లు పంపిణీ చేసే కార్యక్రమం పొనాలలో ప్రారంభం
చిత్రం న్యూస్, బేల : రాష్ట్ర మాజీ మంత్రి, బీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న జన్మదినాన్ని పురస్కరించుకొని మండలంలోని ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 500మంది విద్యార్థులకు శుక్రవారం ఆడనేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల బీఆర్ఎస్ నాయకులతో కలిసి నోట్ బుక్ లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని పొనాల గ్రామంలో శుక్రవారం ప్రారంభించారు. గ్రామంలో రక్త దానం చేశారు .ఈ సందర్భంగా జోగు రామన్న గారి బర్త్డేను కేక్ కట్ చేసి ఘనంగా స్కూల్ పిల్లలతో జరుపుకున్నారు. జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రౌత్ మనోహర్ మాట్లాడుతూ.. జోగు రామన్న ప్రజల మనిషి అని ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ప్రజా నాయకుడు అని పేర్కొన్నారు. జోగు రామన్న ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, అడానేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ ,బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు సతీష్ పవార్, మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గంభీర్ ఠాక్రే, దేవన్న ఒళ్లప్వర్ ,తేజ రావు మస్కే , మధుకర్ జక్కల్వార్,తనుబ ఠాక్రే, సుదర్శన్ భతుల ,విపిన్ ఖోడే ,శత్రుగన్ ,గ్రామస్థులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఉచిత కంటి వైద్య శిభిరానికి విశేష స్పందన
ఉచిత కంటి వైద్య శిభిరానికి విశేష స్పందన
చిత్రం న్యూస్, చిగురుమామిడి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామంలో శుక్రవారం రోజు ఉచిత కంటి శస్త్ర చికిత్స శిబిరం నిర్వహించారు. శ్రీనివాస విజన్ సెంటర్, అక్షర ఎడ్యూకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిభిరానికి విశేష స్పందన వచ్చింది.200 మంది పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు.కంటి పరీక్షలు నిర్వహించిన అనంతరం శుక్లాం ఆపరేషన్ అవసరమైన 19 మందిని ఏలాంటి రవాణా ఖర్చు లేకుండా ప్రత్యేక వాహనంలో హైద్రాబాద్ లోని ఆసుపత్రి తరలించామని, గ్రామీణ ప్రాంత ప్రజలు ఇలాంటి అవకాశలను వినియోగించూసుకోవాలని కంటి పరీక్ష నిపుణులు తిప్పారపు శ్రీనివాస్ తెలిపారు. ఈ వైద్య శిబిరములో బుర్ర శ్రీనివాస్ గౌడ్, జక్కుల బాబు, ముంజ ప్రకాష్ గౌడ్, బండి ఆదిరెడ్డి, జక్కుల స్వామి, పచ్చిమట్ల అజయ్ కుమార్ గౌడ్, రాజు గౌడ్. ముత్యాల మహేందర్. కక్కర్ల సంపత్ కుమార్ తో పాటు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ మండల కార్యదర్శిగా కల్లేపల్లి గంగయ్య
సీపీఐ మండల కార్యదర్శిగా కల్లేపల్లి గంగయ్య
*ఇచ్చోడలో సీపీఐ నాల్గవ మహాసభలో పాల్గొన్న జిల్లా సహాయ కార్యదర్శి సిర్రా దేవేందర్
చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఇచ్చోడ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో సీపీఐ నాల్గవ మహాసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సీపీఐ సహాయ కార్యదర్శి సిర్రా దేవేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇచ్చోడలో సమస్యలు తిష్ట వేశాయని వెంటనే పాలకులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం సీపీఐ మండల నూతన కార్యదర్శిగా కల్లేపల్లి గంగయ్య, మండల సహాయ కార్యదర్శిగా దుబ్బాక అశోక్ లను ఎన్నుకున్నారు. మెడపట్ల రాజేందర్, బోదాసు రవి, అన్నెల చిన్న లక్ష్మన్న, విలాస్, దుబ్బాక అశోక్ లను సీపీఐ కార్యవర్గ సభ్యులుగా,చౌహాన్ సంజు, యోగేష్ బుజ్జి, రాజ్ కుమార్, ముదుగు శివకుమార్, మెడపట్ల వెంకటేష్, గస్కంటి మహేష్, ఎం ప్రసాద్, ఏ రాజ్ కుమార్, దుబ్బాక లక్ష్మణ్, రాజేశ్వర్ లను కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకున్నారు.
రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంది
రైతులకు సరిపడా యూరియా అందుబాటులో
చిత్రం న్యూస్, బేల: బేల మండలంలో సీజన్కు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా ఏడిఏ శ్రీధర్ అన్నారు. రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని సూచించారు. మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులు, గోదాములను శుక్రవారం ఆయన వ్యవసాయ అధికారి సాయి తేజ రెడ్డి తో కలిసి ఆకస్మి కంగా తనిఖీ చేశారు. దుకాణాల్లోని విత్తనాలు, ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
వర్షాలు కురవడంతో మండలంలో రైతాంగం యొక్క పంటలు ప్రస్తుతం బాగున్నాయాని పేర్కొన్నారు.మండలానికి 100 టన్నుల యూరియా హకా సెంటర్ కు పంపిణి చేశామన్నారు. త్వరలో సహకార సంఘాలకు కూడా యూరియా పంపిణి చేస్తామన్నారు. ప్రైవేటు డీలర్ల వద్ద కూడా యూరియా, డీఏపీ అందుబాటులో ఉందన్నారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీలర్లను హెచ్చరించారు. ఆయన వెంట ఏవో సాయి తేజ రెడ్డి, ఏఈవో ఉమర్ ఉన్నారు.
యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండాలి
యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండాలి
_మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
*బోథ్ మండలం కౌట (బి) గ్రామం లో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ యువత, ప్రజలు, విద్యార్థులు
* పోలీసు, వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు
చిత్రం న్యూస్, బోథ్: యువత సన్మార్గం వైపు పయనిస్తూ చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం సాయంత్రం బోథ్ మండలం కౌట (బి) గ్రామంలో వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొని యువతకు విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు. మొదటగా జిల్లా ఎస్పీకి ఘన స్వాగతం పలికిన విద్యార్థులు, ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న స్థితిగతులపై, బోథ్ మండలంలో ఉన్న యువత ప్రజలు మొబైల్ ఫోన్ వాడకం వినియోగం ఎక్కువగా జరుగుతున్న వాటిపై జిల్లా ఎస్పీకి వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. యువత ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని తెలిపారు. గ్రామంలోని ఎందరో మంది ఉన్నత స్థానాలకు ఎదిగారని వారిని స్ఫూర్తిగా తీసుకొని తాము ఉన్నత లక్ష్యాలను సాధించాలని తెలిపారు. యువతకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించి వాటి బారిన పడితే కలిగే అనర్ధాలపై వివరించారు. ముఖ్యంగా విద్యార్థినిలకు అండగా ఆదిలాబాద్ జిల్లా షీ టీం బృందం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ఎలాంటి సహాయ సహకారమైన 871265953 నెంబర్ కి సంప్రదించాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై గంజాయి, మాదకద్రవ్యాలపై ప్రత్యేక కార్యచరణ రూపొందించి అవలంబించడం జరుగుతుందని, అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు మెసేజ్ యువర్ ఎస్పీ అనే కార్యక్రమంలో ద్వారా ప్రారంభించబడిన 8712659973 నెంబర్ కి సమాచారం అందించవచ్చని తెలిపారు. యాంటి డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన , చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. విద్యార్థులచే మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేయించి వారిని యాంటీ డ్రగ్ సోల్జర్ గా పని చేయాలని తెలిపారు. గంజాయి పండించి,న వ్యాపారం చేసిన, సేవించినా చట్ట ప్రకారం నేరంగా పరిగణించబడుతుందని వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని ప్రభుత్వం ద్వారా వచ్చే ఎలాంటి లబ్ది వారికి చేయకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, ఎస్సై ప్రవీణ్ కుమార్, గ్రామ పెద్దలు, యువత, చిన్నారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ
ప్రధానోపాధ్యాయుడు జాడి సుదర్శన్ కు ప్లేట్లను అందజేస్తున్న విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు గడ్డం నాగారెడ్డి
చిత్రం న్యూస్, బేల: బేల మండలం సాంగిడి ఉన్నత పాఠశాల విద్యార్థులకు అదే గ్రామానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు గడ్డం నాగారెడ్డి ప్లేట్లను విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసి ఉదారత చాటుకున్నారు.. గురువారం పాఠశాలకు వెళ్లి వీటిని ప్రధానోపాధ్యాయుడు జాడి సుదర్శన్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థులు బాగా చదివి కన్నవారి కలలను సహకారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రఘునాథ్, గోకుల్, అశోక్ తదితరులు పాల్గొన్నారు
ఘనంగా ప్రపంచ బైక్ మెకానిక్ దినోత్సవ వేడుకలు
పెద్దాపురంలో ర్యాలీనీ ప్రారంభిస్తున్న రాజా సూరి బాబు రాజు
చిత్రం న్యూస్, పెద్దాపురం: ప్రపంచ బైక్ మెకానిక్ దినోత్సవ వేడుకలు పెద్దాపురంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బైక్ మెకానిక్ లు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు స్వగృహం వద్దకు అక్కడ నుంచి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని రాజా సూరిబాబురాజు జెండా ఊపీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బైక్ మెకానిక్ లు సంఘటికంగా ఉంటూ హక్కుల కోసం సమిష్టిగా కదలాలన్నారు.ఈ సందర్బంగా యూనియన్ తరుపున సీనియర్ మెకానిక్ లైన సింగారపు అప్పారావు, కోరాడ సూర్యనారాయణ, నందూరి నీలబాబులను ఘనంగా సత్కరించారు.కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు నమ్మి నాగరాజు, రంగారావు, శంకర్, యర్రా శ్రీను, జంపా శ్రీను, కాకి రాజు, మల్లేశ్వరరావు, మణికంఠ, శివ, సింగారపు శ్రీనివాసరావు, వాసు, శివ, సుబ్బారావుతో పాటు పెద్ద సంఖ్యలో మోటార్ మెకానిక్ వర్కర్స్ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు నమూనా ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
ఇందిరమ్మ ఇండ్లు నమూనా ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
చిత్రం న్యూస్, శంకరపట్నం: మండలం కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి నూతనంగా నిర్మించబోయే ముఖద్వారానికిమానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ భూమిపూజ చేశారు. ఈ ముఖద్వారానికి నిర్మాణ దాతలు తాండ్ర నిర్మల, శంకర్ బాబు శాలువాతో సన్మానించారు. శ్రీ ఎల్లమ్మ ఆలయానికి ముఖద్వారం ఎమ్మెల్యే చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. అనంతరం శంకర పట్నం రైతు వేదిక పక్కకు నూతనంగా నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అనంతరం సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు ఇల్లు నిర్మించే ఇవ్వడమే కాంగ్రెస్ లక్ష్యమని ,ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ ఇల్లే అని ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేఖ, ఎంపీడీఓ కృష్ణ ప్రసాద్, టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, మల్లారెడ్డి ,ఆలయ కమిటీ చైర్మన్ కోరేం రాజిరెడ్డి , గట్టు తిరుపతి గౌడ్, సదానందం గౌడ్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.










