Home Blog Page 173

కరీంపేటలో బీజేపీ రచ్చబండ కార్యక్రమం

కరీంపేటలో బీజేపీ రచ్చబండ కార్యక్రమం

*శక్తి కేంద్రం ఇన్చార్జి రసమల శ్రీనివాస్

చిత్రం న్యూస్, శంకరపట్నం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో వికసిత్ భారత్ అమృత కాలం సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి 11 ఏళ్లు పూర్తైన సందర్భంగా మండలంలోని  కరీంపేట శక్తి కేంద్రం పరిధిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ ఎస్టీ మోర్చ మండల అధ్యక్షుడు బిజిలి సారయ్య హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం ఇంచార్జి రాసమల శ్రీనివాస్, బూత్ కమిటీ అధ్యక్షులు గోపి శ్రీనివాస్,నాయకులు మెడిశెట్టి రాజేష్, రొడ్డ స్వామి, మెడిశెట్టి రాకేష్, నాంపల్లి అజయ్, గుర్రం సదానందం, గంపల‌ శివాజీ, చింతం రాజు, రాజేశం, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

*హుజురాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా జన్మదిన వేడుకలు నిర్వహించన కాంగ్రెస్ శ్రేణులు.

చిత్రం న్యూస్, శంకరపట్నం: దేశంలోని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రజల పక్షాన నిలబడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ అన్నారు. ఏఐసీసీ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భారత్ జోడో న్యాయ్ యాత్ర ద్వారా అందరికీ చేరువై అన్ని వర్గాల సమస్యలను తెలుసుకొని తెలంగాణలో కులగణన ద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేశారన్నారు.రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ పట్టణ, మండల అధ్యక్షులు,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, యువజన విభాగం, మహిళా అధ్యక్షురాలు, యువజన కాంగ్రెస్, ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ, సేవాదళ్, అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

కూచిపూడి పోటీల్లో హుజురాబాద్ చిన్నారి నిర్విరెడ్డికి ప్రథమ స్థానం

కూచిపూడి పోటీల్లో హుజురాబాద్ చిన్నారి నిర్విరెడ్డికి ప్రథమ స్థానం

*అభినందించిన కరీంనగర్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి

చిత్రం న్యూ స్, శంకరపట్నం:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలో  నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన పోటీల కళా సమ్మేళన్ 2025లో హుజురాబాద్ పట్టణానికి చెందిన వై.వినోద-మహేందర్ రెడ్డి దంపతుల కుమార్తె వై.నిర్విరెడ్డి ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా బీజెపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, హుజురాబాద్ రూరల్ బీజెపీ నాయకులు చిదిరాల శ్రీనివాస్ రెడ్డి- రాణి దంపతులు వై.నిర్విరెడ్డిని కలిసి అభినందించారు. శాలువా కప్పి సన్మానించారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నిర్విరెడ్డి విజయం హుజురాబాద్ కు గర్వకారణమని తెలిపారు.

పెద్దాపురం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

0

పెద్దాపురం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

చిత్రం న్యూస్, పెద్దాపురం:  పెద్దాపురం పట్టణంలోని  శతాబ్ది పార్క్ దగ్గర సబ్ స్టేషన్ లో 33/11kv మరమ్మతులో భాగంగా 20న శుక్రవారం ఉదయం గం.7.00 నుంచి మధ్యాహ్నం గం.1.00 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఎలక్ట్రికల్, ఆపరేషన్ A V. N. D. S ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ పరిధిలో పాత పెద్దాపురం,చేపల వీధి, తాడితోట, కుమ్మర వీధి, నాగేశ్వరావు వీధి, పాత బస్ స్టాండ్, మిరపకాయల వీధి, మెయిన్ రోడ్, R B పట్నం రోడ్, శివాలయం వీధి, సినిమా సెంటర్, వ్యాపారపుంత, గౌరికోనేరు, టైలర్స్ కాలనీ, కొత్త పేట, సత్తిరెడ్డి పేట, బంగారమ్మ గుడి వీధి, వీర్రాజు పేట, పరదేశమ్మ కాలనీ, నువ్వులగుంట వీధి, మరిడమ్మా టెంపుల్, గోలి వారి, అంకాయ్యమ్మా పేట, సుబ్బయమ్మ పేట, పాత హాస్పిటల్ వీధి, నవోదయ స్కూల్, రాజీవ్ కాలనీ, వ్యవసాయ బోర్ సర్వీసెస్ కి మరియు ఎన్టీఆర్ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం  ఉంటుందన్నారు.  వినియోగదారులు సహకరించాలని కోరారు.

 

కేశవపట్నం ఎస్ఐ గా కట్కూరి శేఖర్ రెడ్డి

కేశవపట్నం ఎస్ఐ గా కట్కూరి శేఖర్ రెడ్డి

చిత్రం న్యూస్, శంకరపట్నం: కేశవపట్నం ఎస్ఐగా కట్కూరి శేఖర్ రెడ్డి బుధవారం రోజు బాధ్యతలు స్వీకరించారు. వీణవంక జమ్మికుంట లో ఎస్ఐ గా విధులు నిర్వహించిన ఆయన   కేశవపట్నం ఎస్ఐ గా బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేసిన ఎస్ఐ కొత్తపల్లి రవి కమిషనరేటుకు బదిలీ అయ్యారు.

మరిడమ్మ అమ్మవారి దేవస్థానం లో ఉత్సవ కమిటీ, అఖిల పక్ష  నాయకుల సమావేశం

0

మరిడమ్మ అమ్మవారి దేవస్థానం లో ఉత్సవ కమిటీ, అఖిల పక్ష  నాయకుల సమావేశం

చిత్రం న్యూస్, పెద్దాపురం:  కాకినాడ జిల్లా పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి ఆషాడ మాస జాతర మహోత్సవములు జూన్ 24,నుండి జూలై 31వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో విజయలక్ష్మి తెలిపారు. 37 రోజులు జరిగే జాతర మహోత్సవాలకు తీసుకోవలసిన జాగ్రత్తలు సూచనలు కోసం ఈ రోజు బీజెపీ తరుపున ,శ్రీ మరిడమ్మ అమ్మవారి దేవస్థానం లో ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీ, అఖిల పార్టీ సమావేశం నిర్వహించారు.పెద్దాపురం పట్టణ అధ్యక్షుడు బొలిశెట్టి రాంకుమార్  పాల్గొనారు.  అమ్మవారి దర్శనానికి వచ్చే వృద్దులకు, చంటి బిడ్డలను తీసుకువచ్చే వారికి రద్దీ సమయంలో వారి కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయాలని,  భక్తులకు ఎలని అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ EO విజయలక్ష్మిని కోరారు.

430 మందికి సర్వేపల్లి రాధాకృష్ణ విద్య కానుక

0

430 మందికి సర్వేపల్లి రాధాకృష్ణ విద్య కానుక

చిత్రం న్యూస్, పెద్దాపురం: పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు జూన్ 12న స్కూల్  పునః ప్రారంభమయ్యాయి. ఈ విద్యా సంవత్సరం కిగాను 430 మందికి సర్వేపల్లి రాధాకృష్ణ విద్య కానుకగా బుక్స్, బ్యాగ్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ లక్ష్మణ్, హెచ్ఎం శ్రీవల్లి, కోటి రేలంగి బుజ్జి, కొమ్మిరెడ్డి.బుజ్జి , పెద్దాపురం Itdp అధ్యక్షులు,AMC డైరెక్టర్ రేలంగి వెంకట్రావు తదితరులు పాల్గొనారు.

గట్టు తిరుపతి గౌడ్ ఉదారత

గట్టు తిరుపతి గౌడ్ ఉదారత

*కార్యకర్తకు ఆర్థిక సాయం అందజేత

చిత్రం న్యూస్, శంకరపట్నం: శంకరపట్నం మండలంలోని  కేశవపట్నం గ్రామానికి చెందిన లింబాద్రి అనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కు ఇటీవల ప్రమాదం జరిగింది. దీనితో చలించిపోయిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిరుపతి గౌడ్ బాధితుని ఇంటికి చేరుకొని  పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగతంగా రూ. 3 వేలు ఆర్థిక సహాయం అందజే5సి తన ఉదారతను చాటుకున్నాడు. ఈ సందర్భంగా లింబాద్రి గట్టు తిరుపతి గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు

ఆదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ సమీక్షా సమావేశం విజయవంతం చేయాలి

ఆదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ సమీక్షా సమావేశం విజయవంతం చేయాలి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఈ నెల 18న మధ్యాహ్నం ఆదిలాబాద్ పట్టణంలో యువజన కాంగ్రెస్ కమిటీ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిచరణ్ గౌడ్ తెలిపారు. జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొనడానికి యువజన కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి. శివచరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా వస్తున్నారన్నారు. కలెక్టర్ చౌక్ లోని వజ్ర బాంకెట్ హాల్ లో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి ఆదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

త్వరలో ఆడబిడ్డ నిధి అమలుకు శ్రీకారం

0

త్వరలో ఆడబిడ్డ నిధి అమలుకు శ్రీకారం

*18 ఏళ్లు నిండిన మహిళకు నెలకు రూ.1500 వంతున ఏడాదికి రూ.18 వేలు

*రూ.3 వేల కోట్లకు పైగా నిధులు సమీకరణ

*మరో హామీ అమలకు సీఎం దూకుడు

చిత్రం న్యూస్, అమరావతి: 

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో  ఆడబిడ్డ నిధి అనే పథకం అమలుకు శ్రీకారం చుట్టనుంది.18 ఏళ్లు నిండిన మహిళకు నెలకు రూ.1500 వంతున ఏడాదికి రూ.18 వేలు జమచేయనున్నారు.  దీనికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేసింది. ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి ఏడాది బడ్జెట్ లో రూ.3,300 కోట్ల నిధులను కూడా ప్రభుత్వం కేటాయించింది. ఆ నిధులతో బీసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన మహిళలకు సుమారు 1000 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే ఆర్థికంగా వెనుక బడిన మహిళలకు మరో రూ.630 కోట్లు, మైనార్టీ మహిళలకోసం రూ.84 కోట్లు, ఎస్సీ,ఎస్టీ వర్గాల ఆడబిడ్డల కోసం మిగిలిన నిధులను వెచ్చించనున్నారు.