Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం
Home Blog Page 106
0

*28న తెలంగాణ ఉద్యమకారులకు ఘన*28న తెలంగాణ ఉద్యమకారులకు ఘన సన్మానం*

**తెలంగాణ ఉద్యమకారులు భారీగా తరలి రావాలని పిలుపు*

 *చిత్రం న్యూస్ , ఓదెల;* 
ఈనెల 28న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారులకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య అన్నారు.  జిల్లాలో ఉన్న ప్రతి తెలంగాణ ఉద్యమ నాయకులు , నాయకురాలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఓదెల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
 ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు , పెద్దపెల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణరావు, రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ,ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ , చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి ,పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ  , తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ తదితర ప్రముఖులు హాజరవుతారన్నారు. కావున జిల్లాలో ఉన్న ఉద్యమకారులు భారీగా తరలి వచ్చి తమ ఐక్యతను తెలియజేయాలని కోరారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు చెప్పాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి , చర్లపల్లి సురేష్ గౌడ్ , పలకల నరసింహా రెడ్డి , నూతి శంకర్ ,కందుల అశోక్ ,వేల్పుల కుమార్ , బూరుగుపల్లి పుల్లారెడ్డి , లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. సన్మానం*

**తెలంగాణ ఉద్యమకారులు భారీగా తరలి రావాలని పిలుపు*

*చిత్రం న్యూస్ , ఓదెల;*
ఈనెల 28న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారులకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య అన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి తెలంగాణ ఉద్యమ నాయకులు , నాయకురాలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఓదెల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు , పెద్దపెల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణరావు, రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ,ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ , చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి ,పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ , తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ తదితర ప్రముఖులు హాజరవుతారన్నారు. కావున జిల్లాలో ఉన్న ఉద్యమకారులు భారీగా తరలి వచ్చి తమ ఐక్యతను తెలియజేయాలని కోరారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు చెప్పాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి , చర్లపల్లి సురేష్ గౌడ్ , పలకల నరసింహా రెడ్డి , నూతి శంకర్ ,కందుల అశోక్ ,వేల్పుల కుమార్ , బూరుగుపల్లి పుల్లారెడ్డి , లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

ఓదెలలో పెళ్లికి హాజరైన మాజీ జెడ్పిటిసి గంట రాముల యాదవ్*

0

చిత్రం న్యూస్, ఓదెల; పెద్దపెల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో మారుతి ఫంక్షన్ హాల్లో శ్రీరామోజు లావణ్య శ్రీనివాసుల ప్రథమ పుత్రిక స్నేహ హరీష్ చారిల పెళ్లి వేడుకకు ఓదెల తాజా మాజీ జెడ్పిటిసి గంట రాములు యాదవ్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వీరి వెంట పోలోజు రమేష్, నరేష్, తదితరులు ఉన్నారు.
చిత్రం న్యూస్, ఓదెల:   

పెద్దపెల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో మారుతి ఫంక్షన్ హాల్లో శ్రీరామోజు లావణ్య శ్రీనివాసుల ప్రథమ పుత్రిక స్నేహ హరీష్ చారిల పెళ్లి వేడుకకు ఓదెల తాజా మాజీ జెడ్పిటిసి గంట రాములు యాదవ్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వీరి వెంట పోలోజు రమేష్, నరేష్, తదితరులు ఉన్నారు.

*ఓదెలలో పెళ్లికి హాజరైన మాజీ జడ్పీటీసీ గంట రాములు యాదవ్*

0

పెద్దపెల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో మారుతి ఫంక్షన్ హాల్లో శ్రీరామోజు లావణ్య శ్రీనివాసుల ప్రథమ పుత్రిక స్నేహ హరీష్ చారిల పెళ్లి వేడుకకు ఓదెల తాజా మాజీ జెడ్పిటిసి గంట రాములు యాదవ్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వీరి వెంట పోలోజు రమేష్, నరేష్, తదితరులు ఉన్నారు.

మహిమాన్విత పుణ్యక్షేత్రం జైనథ్ దేవాలయం

0
Jainad temple laxmi narayana
  1. జై జై శ్రీమన్నారాయణ

చిత్రం న్యూస్, ఆదిలాబాద్;

శ్రీలక్ష్మీనారాయణ !
లీలాయుత భక్తలోల ! ప్రియ పరిపాలా !
త్రైలోక్యధామ ! రక్షక !
పాలించగ దయను జూపు పావన చరితా !

jaind temple image
తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేది అతి ప్రాచీన మహిమాన్విత పుణ్యక్షేత్రం జైనథ్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం. 12వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని అష్ట కోణాకృతిలో జైనులు నిర్మించారు. నల్ల రాయితో నిర్మించిన ఈ ఆలయంలో లక్ష్మీనారాయణ స్వామి మూలవిరాట్టు ఏకశిలతో తయారు చేశారు. ఆలయ నిర్మాణశైలి, అద్భుత కళా సంపద చూపరులను ఆకట్టుకుంటుంది.

ఆలయ ప్రత్యేకత

శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఏడాదికి రెండుసార్లు స్వామివారి పాదాలను సూర్య భగవానుని కిరణాలు తాకుతుండడం ఈ ఆలయ ప్రత్యేకత. సూర్యకిరణాలు స్వామి పాదాలను తాకినప్పుడు స్వామి విగ్రహం బంగారు వర్ణంలో కాంతులీనుతూ దర్శనమిస్తాడు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. నల్ల రాతితో కట్టిన అద్భుత కట్టడాలను చూడడానికి రెండు కళ్ళు సరిపోవు.

Jainad temple laxmi narayana

ఘనంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు

శ్రీమన్నారాయణుని బ్రహ్మోత్సవాలు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మొదలవుతాయి. ద్వాదశి రోజున కల్యాణోత్సవం జరుగుతుంది. కార్తీక బహుళ పంచమి రోజున స్వామి వారి రథోత్సవం అశేష జన వాహిని నడుమ కనుల పండువగా సాగుతుంది. ఈ రథోత్సవం తిలకించేందుకు తెలంగాణ, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు.

ఆకట్టుకుంటున్న విగ్రహాలు

ఆలయంలో ఆది దేవుడు గణపతితో పాటు చెన్నకేశవ స్వామి, పద్మనాభ స్వామి, గరుత్మంతుడు, హయగ్రీవ స్వామి విగ్రహాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. పక్కన శివాలయం ఉంది. ఆలయ గోడలపై చెక్కిన శిల్పాలు జైనుల నాటి కళా నైపుణ్యానికి తార్కాణంగా నిలుస్తున్నాయి. ప్రతిరోజూ భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. సుదూర ప్రాంతాలనుంచి భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు.

jainad laxminarayana swamy

జైనథ్ ఇలవేల్పు శ్రీమన్నారాయణుడు

కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారం శ్రీ లక్ష్మీనారాయణ స్వామిగాను, సకల శుభాలను కలుగజేసే శ్రీమన్నారాయణుడి గాను, సంతాన భాగ్యం కలుగజేసే
సత్యనారాయణ స్వామిగాను ఆ దేవ దేవుని భక్తులు కొలుస్తారు. అయిదు పున్నములు వచ్చేలా ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. కళ్యాణోత్సవం రోజు సాయంత్రం అర్చకులు గరుడ ముద్ద అందజేస్తారు. ఈ ప్రసాదం తింటే సంతానం కలగని వారికి సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు.

jainad temple

ఇలా వెళ్ళవచ్చు

ఆదిలాబాద్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది జైనథ్ ఆలయం. ఈ ఆలయం చేరుకోవడానికి అరగంటకో బస్సు ఉంటుంది. జైనథ్ బేల, గడ్ చందూర్, చంద్రపూర్ బస్సులు వెళుతుంటాయి. బ్రహ్మోత్సవాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది.