Home Blog Page 105

ఘనంగా తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

బోరంచు శ్రీకాంత్ రెడ్డిని సన్మానిస్తున్న  టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ

చిత్రం న్యూస్, మావల: తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు మావల మండల కేంద్రంలోని ఆయన నివాసంలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ జన్మదిన వేడుకల కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, వివిధ మండలాల అధ్యక్షులు హాజరై బోరంచు శ్రీకాంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

✖ Close హోం

రాజ్ గోండ్ సేవ సమితి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులుగా (న్యాయవాది) పంద్రం శంకర్

రాజ్ గోండ్ సేవ సమితి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులుగా (న్యాయవాది) పద్రం శంకర్

*ఈనెల 27న రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావుతో పాటు ప్రమాణస్వీకారం చేయనున్న జిల్లా అధ్యక్షులు పద్రం శంకర్

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం లోని పట్నాపూర్ గ్రామానికి చెందిన న్యాయవాది పద్రం శంకర్ ను ఆదిలాబాద్ జిల్లా రాజ్ గోండ్ సేవ సమితి జిల్లా అధ్యక్షులుగా నియమిస్తూ స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.  జిల్లా అధ్యక్షులుగా తనకు భాద్యతలు అప్పగించడంతో పద్రం శంకర్ రాజ్ గోండ్ సేవ సమితి స్టీరింగ్ కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 27న రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపురావుతో పాటు జిల్లా అధ్యక్షులుగా తాను ప్రమాణస్వీకారం చేయనున్నట్లు  పద్రం శంకర్ తెలిపారు. తనకు అప్పగించిన భాద్యతలను సక్రమంగా నిర్వహించి రాజ్ గోండ్ సేవ సమితికి తనవంతుగా కృషి చేస్తానన్నారు.

✖ Close హోం

పులిమేరు లో డోర్ టు డోర్  కార్యక్రమం నిర్వహించిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు

0

పులిమేరు లో డోర్ టు డోర్  కార్యక్రమం నిర్వహించిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు

చిత్రం న్యూస్, పెద్దాపురం:  కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు రెండో రోజు బూత్ నెంబర్ 35, 36 ,37లో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆదేశాల మేరకు  డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేలంగి వెంకట్రావు తెలిపారు. ఆయన వెంట పులిమేరు గ్రామ కమిటీ ప్రెసిడెంట్ అవిన్, అశోక్, బూత్ ఇంచార్జ్ లు కార్యకర్తలు పాల్గొన్నారు.

✖ Close హోం

డొప్టాలలోని  శ్రీ రామాలయ పునఃనిర్మానాణికి భూమి పూజ

డొప్టాలలోని  శ్రీ రామాలయ పునఃనిర్మాణానికి భూమిపూజ

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని డొప్టాల గ్రామంలో  సుమారు 50 లక్షల నిధులతో శ్రీ రామాలయం పునఃనిర్మాణ పనులకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సోమవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ అసెంబ్లీ కన్వీనర్ విజయ్ బోయర్, మండల అధ్యక్షులు ఇంధ్రశేఖర్, గ్రామ మాజీ సర్పంచ్ రాకేష్, బీజేపి మండల సీనియర్ నాయకులు నిక్కం దత్త, రాము, మోరేశ్వర్, నవీన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

జవాను మృతి

   జవాను నలువాల ఆకాశ్

చిత్రం న్యూస్, బోథ్:  ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం వర్తమన్నూరు గ్రామానికి చెందిన జవాను నలువాల ఆకాష్ (24) సోమవారం మృతిచెందారు. అస్సాం రైఫైల్స్ జీఢీ విభాగంలో జవానుగా విధులు నిర్వహిస్తున్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. పేద కుటుంబం నుంచి దేశ సేవకు కఠోరమైన శిక్షణను పొంది15 రోజుల్లో శిక్షణ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చే సమయంలో  అనంతలోకాలకు వెళ్ళిపోవడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోతున్నారని గ్రామస్తులు తెలిపారు. చెట్టంత కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తుండడం అక్కడున్నవారందరినీ కలిచివేసింది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

✖ Close హోం

మరిడమ్మ దేవస్థానంలో పూర్వ విద్యార్థుల పులిహోర పంపిణి

0

మరిడమ్మ దేవస్థానంలో పూర్వ విద్యార్థుల పులిహోర పంపిణి

చిత్రం న్యూస్, పెద్దాపురం: పెద్దాపురంలోని మహారాణి డిగ్రీ కాలేజ్‌కి చెందిన 1988-91 B.Com (B) బ్యాచ్ పూర్వ విద్యార్థులు  శ్రీ మరిడమ్మ దేవస్థానంలో  భక్తులకు పులిహోర, వాటర్, చిన్నారులకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అమ్మవారి జాతర మహోత్సవాలను పురస్కరించుకుని  ఆలయానికి విచ్చేసిన భక్తులకు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు  పూర్వ విద్యార్థులు తెలిపారు.  అమ్మవారి జాతరలో భాగస్వామ్యం కావడం  ఎంతో ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో అందరి జీవితాల్లో శాంతి, సమృద్ధి, ఆరోగ్యం ఏర్పడాలని ఆకాంక్షించారు. సమాజానికి చిన్నపాటి సేవ చేయగలిగే ఈ అవకాశం  మరిదమ్మ అమ్మవారి ద్వారా కలిగిందన్నారు.  భవిష్యత్తులో మరిన్ని ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలనే సంకల్పంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాబోలు సత్య ప్రసాద్, పైడా రామకృష్ణ, ఆర్వీ సత్యనారాయణ, ప్రతాప్ సింహా, కశిరెడ్డి శ్రీను, చి.వెంకటేశ్వరరావు, డీవీడీ సత్యనారాయణ, జగ్గారావు, వి.అప్పారావు, వసంతరావు, కర్రి వరలక్ష్మి, కె.సత్యనారాయణ, ఉమా మహేశ్, కామరాజు తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

బీసీలకు అండగా తెలుగుదేశం పార్టీ

0

మంత్రి కొలుసు పార్థ సారధిని సన్మానిస్తున నాయకులు
*యాదవులకు చట్ట సభల్లో ప్రముఖ స్థానం కల్పించింది కూటమి ప్రభుత్వం

చిత్రం న్యూస్, నూజివీడు: బీసీలకు అండగా నాడు, నేడు తెలుగుదేశం పార్టీ అండగా ఉందని, యాదవులకు చట్ట సభల్లో ప్రముఖ స్థానం కల్పించింది కూటమి ప్రభుత్వమేనని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. కృష్ణా జిల్లా పోరంకి, సీతారామ గార్డెన్ లో యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. యాదవ సోదర కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం ఎంతో సంతోషదాయకం అన్నారు. సోదరులంతా ఐక్యతతో ఉండి అటు వ్యాపారంలో ఇటు రాజకీయంగా ఎదగాలని సూచించారు. యాదవులు వ్యాపారానికి గొర్రెల, మేకల పెంపకానికి ప్రభుత్వం సుమారు రూ.1కోటి వరకు సబ్సిడీ రుణాలు అందిస్తుందని, దానికి సంబంధించిన సహాయ, సహకారాలు  ప్రభుత్వం తరపున అందిస్తానన్నారు.యాదవులంతా కలిసి ఉండి చట్ట సభల్లో ప్రముఖ స్థానం సంపాదించి తద్వారా మిగిలిన సోదరులకు చేయూత నివ్వాలని పేర్కొన్నారు. బీసీలు,  యాదవులు అంటే తెలుగుదేశం పార్టీకి వెన్నుముఖ అన్నారు.యాదవుల సంక్షేమానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశ పెట్టాయని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.  బ్యాంక్ రుణాలు ఇప్పించడంలో బ్యాంకు వారితో మాట్లాడి త్వరగా అందించే బాధ్యత నాది అని ఎవరికి ఏ అవసరం వచ్చిన నన్ను నేరుగా సంప్రదించాలన్నారు. ఎన్ని ఎకరాలు ఉన్న దాన్ని బట్టి బ్యాంకు వారు సబ్సిడీ రుణాలు ఇచ్చి, తద్వారా పారిశ్రామికవేత్తలుగా. మంచి వ్యాపార వేత్తలుగా ఎదగడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. గొర్రెలు, మేకలు, గేదలు, ఫారంలు నిర్మించడానికి ఎన్నో పథకాలు ఉన్నాయని, బ్యాంకులు రుణాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయని దాన్ని అంది పుచ్చుకొని ఆర్ధికంగా మన యాదవ సోదరులంతా ఎదగాలన్నారు. దానికి నా వంతు సహాయ,సహకారాలు అందిస్తానని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

ఉచిత వైద్య శిబిరానికి రావాలని  బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ కు ఆహ్వానం

ఉచిత వైద్య శిబిరానికి రావాలని  బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ కు ఆహ్వానం

చిత్రం న్యూస్ బోథ్:  బోథ్ మండల కేంద్రంలోని లోకమాన్య నగర్ లో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరానికి హాజరు కావాలని  బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ను లోకమాన్య యూత్ సభ్యులు కోరారు. ఈ మేరకు ఆదివారం ఆహ్వాన పత్రికను  ఆయనకు అందజేశారు. బాలగంగాధర్ తిలక్  169 వ జయంతి సందర్భంగా ఈ నెల 23న ఉదయం 9 గంటలకు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు వేణు, విష్ణు, సంతోష్,  రాంసాగర్, కిరణ్, విజయ్, కుశల్ రెడ్డి. శశికాంత్, వినయ్ తదితరులు ఉన్నారు.

✖ Close హోం

సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా సొనాల గ్రామంలోని రామాలయంలో హిందూ ధర్మ జాగరణ మండలి  ఆధ్వర్యంలో డిసెంబర్ 2023 శనివారం రోజున ప్రారంభించిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం కొనసాగుతోంది. ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు సభ్యులతోపాటు భక్తులు, విద్యార్థులు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొంటున్నారు. నేటికీ 83 వారాలను పూర్తి చేసుకున్నట్లు సభ్యులు తెలిపారు. హనుమాన్ చాలీసా పారాయణం వలన భక్తిశ్రద్ధలు, ఏకాగ్రత, ఆధ్యాత్మికత, క్రమశిక్షణ, మంచి భావాలు, ధైర్యం ,తేజస్సు మొదలైన గుణాలు పెంపొందుతాయని సభ్యులు పేర్కొన్నారు. ప్రతి వారం భగవద్గీత శ్లోకాల పఠనం కూడ చేస్తున్నట్లు సభ్యులు తెలిపారు. వంద వారాల పాటు 2025 నవంబర్ వరకు సామూహిక హనుమన్ చాలీసా పారాయణం కొనసాగుతుందని తెలిపారు.

✖ Close హోం

బేల తహసీల్దార్ కు వినతిపత్రం అందజేత

బేల తహసీల్దార్ రఘునాథ్ రావ్ కు వినతిపత్రం అందజేస్తున్న ఆదివాసీ సంక్షేమ పరిషత్ జనరల్ సెక్రటరీ నందకుమార్

చిత్రం న్యూస్, బేల: జీవో నెంబర్ 49 ను రద్దు చేయాలని కోరుతూ బేల మండల కేంద్రంలోని  తహసీల్దార్ కార్యాలయంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జనరల్ సెక్రటరీ నందకుమార్ కమిటీ సభ్యులతో కలిసి తహసీల్దార్ రఘునాథ్ రావ్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ జనరల్ సెక్రటరీ నందకుమార్ మాట్లాడుతూ.. ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ పేరుతో ప్రభుత్వాలు తీసుకొచ్చినా జీవో నంబర్‌ 49 ద్వారా ఆదివాసీ గ్రామాలు కనుమరుగవు తాయని అడవిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీలకు తీవ్రఅన్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

✖ Close హోం