Home Blog Page 100

ప్రభుత్వ పథకాలు పేదలకు అందాలి       

ఆహార భద్రత కార్డును లబ్ధిదారురాలికి అందజేస్తున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, జైనథ్:  కేంద్ర ప్రభుత్వం అయిన రాష్ట్ర ప్రభుత్వం అయిన ఇచ్చే పథకాలు పేదలందరికీ అందాలని, మన డబ్బులను తిరిగి మనకే వివిధ పథకాల ద్వార ప్రభుత్వాలు ఇస్తున్నాయని వాటిని అర్హులైన ప్రతి ఒక్కరూ పొందాలని ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. మంగళవారం జైనథ్ లోని లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మండపంలో  జైనథ్, బేల, సాత్నాల, భోరజ్ మండలాలకు సంబంధించిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్యతో కలిసి లబ్దిదారులకి రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉంటాయని తర్వాత అభివృద్ధి కోసం పనిచేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జైనథ్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, ఆలయ కమిటీ ఛైర్మన్ రుకేష్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, జైనథ్, బేల, భోరజ్, సాత్నాల మండలాల తహసీల్దార్లు,పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

✖ Close హోం

సామ నర్సింగ్ రెడ్డి బీజేపీలో చేరిక

బీజేపీలో చేరుతున్న సామ నర్సింగ్ రెడ్డి కి కండువా కాప్పుతున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, జైనథ్:  ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కరంజి గ్రామానికి చెందిన నాయకులు సామ నర్సింగ్ రెడ్డి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్  సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఆయనతో పాటు పలువురు కార్యకర్తలు బీజేపీలో  చేరగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ కండువా కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ భోయర్ విజయ్, పార్లమెంట్ కో  కన్వీనర్ మయూర్ చంద్ర, బీజేపీ జైనథ్ మండల అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి, జిల్లా నాయకులు సామ రమేష్ రెడ్డి ఎల్టి అశోక్ రెడ్డి, గంగం రాంరెడ్డి, సూర్యరెడ్డి, పొచ్చన్న, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

✖ Close హోం

ఎస్సీ హాస్టల్ ను సందర్శించిన సామాజిక సమరసత ఖమ్మం జిల్లా హాస్టల్ విద్యార్థి కన్వీనర్ నవీన్

0

ఎస్సీ హాస్టల్ లో మాట్లాడుతున్న సామాజిక సమరసత ఖమ్మం జిల్లా హాస్టల్ విద్యార్థి కన్వీనర్ నవీన్

చిత్రం న్యూస్, ఖమ్మం: ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సామాజిక సమరసత ఖమ్మం జిల్లా హాస్టల్ విద్యార్థి కన్వీనర్ నవీన్ సందర్శించారు.  విద్యార్థులతో సామాజిక సమరసత తెలంగాణ ప్రాంత విద్యార్థి కన్వీనర్ శ్రీ విశ్వేశ్వర్, అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్, వివేకానంద మొదలగు మహాపురుషుల జీవిత చరిత్రల గురించి విద్యార్థులకు వివరించారు. వారిని ఆదర్శంగా తీసుకుని మన విద్య ఈ దేశ బాగు కోసం ఉపయోగపడాలన్నారు.  ఉన్నత విద్యావంతులుగా ఎదిగితే గౌరవం సహజంగానే లభిస్తుందని అని అన్నారు. ఈ దేశ భవిష్యత్తు అన్ని కులాల మీద ఆధార పడిందని, దేశం అభివృద్ధి వైపు అడుగులు వేయాలంటే అందరం కలిసి కట్టుగా పనిచేయాలని అన్నారు. అంబేద్కర్ ఎదుర్కున్న వివక్షత కష్టాలు మనకు లేవని ఒకవేళ ఎదురైనా అంబేద్కర్ వలె నిర్మాణాత్మకంగా ఆలోచించి విద్య ద్వారా మార్పును తీసుకుని రావాలన్నారు.  సమాజాన్ని విడగొట్టే పని ఎక్కడ చేయకూడదని ఒక కులం ఎక్కువ ఒక కులం తక్కువ అనే భావన మన మనసులో నుండి చెరిపివేయాలన్నారు. ఈ దేశ అభివృద్ధిలో అన్ని కులాల పాత్ర ఉందని మరిచిపోవద్దని సైంటిస్టుల నుండి క్రీడాకారుల రంగం వరకు ఏది తీసుకున్న వివిధ కులాలకు చెందిన వారు ఉన్నారని, కేవలం దేశ సేవ మాత్రమే ప్రథమం అనే విధంగా ముందుగు సాగుతూ చరిత్ర సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత ఖమ్మం నగర కన్వీనర్ నూకల మోహన కృష్ణ , సామాజిక సమరసత సంగారెడ్డి జిల్లా సేవా బస్తీ కన్వీనర్ ఎన్.భోజరాజు పాల్గొన్నారు

✖ Close హోం

బోథ్ ఆదర్శ పాఠశాలలో బోధించుటకు ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

 బోథ్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ అనురాధ

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్. జిల్లా బోథ్ ఆదర్శ పాఠశాలలో ఆంగ్ల మాధ్యంలో  బోధించుటకై ఖాళీ పోస్టులకు గంటల ప్రతిపాదనకు పనిచేయుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు ఒకటవ తేదీలోపు  పాఠశాలలో దరఖాస్తులు సమర్పించాలని ప్రిన్సిపల్ అనురాధ తెలిపారు. ఈ పోస్టుకు M.A. B. Ed తోపాటు TET క్వాలిఫై అయి ఉండాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 1వ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపు ఒరిజినల్ ధ్రువపత్రాలు, జిరాక్స్ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వేతనం గరిష్టంగా 18,200 ఉంటుందని తెలిపారు.

ఆదర్శ పాఠశాలలో తక్షణ ప్రవేశాలకు ఆహ్వానం..

బోథ్ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల& కళాశాల లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం C. E. C గ్రూప్, M. E. C గ్రూప్ లో మిగిలిపోయిన సీట్లకు ఆగస్టు 7వ తేదీ వరకు కౌన్సిలింగ్ నిర్వహించి,  భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ అనురాధ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  వివరాలకు ఈ క్రింది నెంబర్లలో సంప్రదించాలని ఆమె కోరారు 9666525131,8374361232

✖ Close హోం

బోథ్ బ్రాహ్మణ మహిళా సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

బోథ్ బ్రాహ్మణ మహిళా సంఘం నూతన కార్యవర్గ సభ్యులు

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ బ్రాహ్మణ మహిళా సంఘం ఎన్నికలు సోమవారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నూతన కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఈ సందర్బంగా సంఘ అధ్యక్షురాలిగా మంజుల దేశ్ పాండే, . ఉపాధ్యక్షురాళ్లుగా ఉమా బొందిడి, కవిత దేశ్ పాండే, కోశాధికారిణి గా బొర్ర నాగజ్యోతి, కార్యదర్శి గా విజయ దేశ్ పాండే ఎంపికయ్యారు. అలాగే సంఘానికి సలహాదారులుగా పుష్ప దేశ్పాండే, అంతుభట్ల శ్రీదేవి, నమలికొండ శ్రీదేవి, ఎలకూచి దీప, అంతుభట్ల జాహ్నవి, N భావన ఎన్నికయ్యారు. అలాగే న్యాయ సలహాదారులుగా శ్రీ వామనరావు దేశ్ పాండే, శ్రీ మోహనరావు లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమములో మహిళ సభ్యులు పాల్గొన్నారు.

✖ Close హోం

తెలంగాణ విద్యార్థి పరిషత్ 13వ ఆవిర్భావ పోస్టర్ల విడుదల 

తెలంగాణ విద్యార్థి పరిషత్ 13వ ఆవిర్భావ పోస్టర్ల ను విడుదల చేస్తున్న విద్యార్థులు

చిత్రం న్యూస్, బోథ్: తెలంగాణ విద్యార్థి పరిషత్ 13వ ఆవిర్భావ దినోత్సవ గోడ పత్రులను బోథ్ నియోజకవర్గ కేంద్రంలో  విద్యార్థులతో సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గ కో కన్వీనర్ సతీష్ మాట్లాడుతూ..తెలంగాణ సాధనే లక్ష్యంగా తెలంగాణ విద్యార్థులకు అండగా నిలుస్తూ అనతి కాలంలోనే ప్రశ్నించే గొంతుకగా పేరు సంపాదించిందన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల సమస్యల పరిష్కారమే ఏకైక జెండాగా పనిచేస్తుందని, టీజీవిపి పోరాట ఫలితంగానే విద్యార్థుల సమస్యలు పరిష్కరించబడ్డాయని, ఫీజు రియంబర్స్మెంట్ హాస్టల్ లో మౌలిక సదుపాయాలు కల్పన కోసం నిరంతర పోరాటం చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో కూడా విద్యారంగ సమస్యలపై సామాజిక సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏదైనా సరే విద్యార్థుల పక్షాన పోరాటం చేయడమే మా విధి అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాము,  విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

ప్రభుత్వ బడి పిల్లలకు వైట్ యూనిఫామ్ పంపిణీ చేసిన ఉపాధ్యాయుడు ప్రకాష్

వైట్ యూనిఫామ్ పంపిణీ చేసిన ప్రభుత్వ బడి పిల్లలతో ఉపాధ్యాయుడు ప్రకాష్, మండల అధికారులు

చిత్రం న్యూస్, సాత్నాల: ఆదిలాబాద్ జిల్లా  సాత్నాల మండలంలోని కాన్ప  మేడిగూడ రోడ్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు  సవాయి ప్రకాష్ , ఆయన కుమారుడు, కోడలు పాఠశాలలో గల మొత్తం101 విద్యార్థులకు రూ.30 వేల విలువగల వైట్ యూనిఫాంలను  అందజేసి ఉదారత చాటారు.  ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ప్రకాష్ మాట్లాడుతూ.. తమ పాఠశాల పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తగ్గకుండా అన్ని రంగాల్లో ముందుకు తీసుకు వెళ్లాలనే ఉద్దేశంతో తాను ఈ వైట్ యూనిఫామ్ విద్యార్థులందరికీ అందజేశానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీడీఓ వెంకట్ రాజు,ఎంఇఓ గంగుల శ్రీనివాస్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సంజీవరెడ్డి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యవాన్ చిక్తే పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయుడు ప్రకాశ్, వారి కుటుంబ సభ్యుల దాతృత్వాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన రిటైర్డ్ ప్రొఫెసర్ విజయ్ బాబు ,,గ్రామస్తులు మరియు పెద్దలు ప్రధానోపాధ్యాయుల పనితీరును ప్రశంసించారు. పాఠశాల ఉపాధ్యాయులు లెనిన్ బాబు, భూమన్న, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

✖ Close హోం

మాదిగ ఉప కులాల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేత 

మాదిగ ఉప కులాల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులు

చిత్రం న్యూస్, బేల:  మాదిగ ఉప కులాల సమస్యల గురించి వినతి పత్రాలు ఇవ్వాలన్న రాష్ట్ర పిలుపుమేరకు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కదరపుప్రవీణ్ మాదిగ, జిల్లా అధ్యక్షులు సుంకే రమేష్ మాదిగ ఇతర నాయకులతో కలిసి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్  రాజర్షి షా కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాదిగలకు అంబేద్కర్ అభయాసం పథకం ద్వారా రూ.12 లక్షల ఇవ్వాలని,  దళితుల భూములను ఆక్రమించిన వారి భూములను వాళ్ళకి ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం లో నిజమైన అర్హులకు ఎస్సీ, ఎస్టీ పేదలకు  రూ.10 లక్షల వరకు ఇవ్వాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఇండస్ట్రీలలో లోన్ తీసుకున్న దళితులకు సబ్సిడీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశామని వినతి పత్రంలో పేర్కొన్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి నడుకుంటి పెంటన్న మాదిగ, జిల్లా కార్యదర్శి సుద్దాల రాజు, శ్రీకర్ మల్యాల, గంగన్న, ఆశన్న, తదితరులు పాల్గొన్నారు. 3

✖ Close హోం

పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో ఆటల పండగ వాతావరణం 

0

పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో ఆటల పండగ వాతావరణం

చిత్రం న్యూస్, పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయంలో  మంగళవారం నుండి మూడు రోజులపాటు ప్రాంతీయ కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలో పాల్గొనడానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి 450 మంది క్రీడాకారులు తరలివచ్చారు. ఈ క్రీడాకారులు అందరూ వారి వారి నవోదయ విద్యాలయాల్లో నుండి ఎంపిక చేయబడి పెద్దాపురం నవోదయ విద్యాలయంలో జరగబోతున్న ప్రాంతీయ కబడ్డీ పోటీలో పాల్గొంటున్నారు. ఈ రీజనల్ కబడ్డీ మీట్ ప్రారంభోత్సవం స్థానిక పారిశ్రామికవేత్త మట్టే శ్రీను బాబు, మట్టే ప్రసాద్ బాబు చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.  ఈ నెల 29 న మంగళవారం ఉదయం 9 గంటలకు క్రీడా జ్వాల, క్రీడా ర్యాలీ, శాంతికపోత ఎగురువేత, బాణసంచా ఇతర కార్యక్రమాలతో ఈ పోటీలు ప్రారంభం కాబోతున్నాయని ఆ విద్యాలయ ప్రిన్సిపాల్ బి.సీతాలక్ష్మి తెలియజేశారు. ఈ ప్రాంతీయ కబడ్డీ పోటీలు పాల్గొనే నిమిత్తం ఎనిమిది క్లస్టర్లు అనగా కృష్ణ క్లస్టర్,ఖమ్మం క్లస్టర్, బీదర్ క్లస్టర్ షిమోగా క్లస్టర్, కడప క్లస్టర్, వైయనాడు క్లస్టర్, తుమకూరు క్లస్టర్ నుండి అండర్ 14, 17 అండర్ 19 బాయ్స్ , గర్ల్స్ కేటగిరిలో వేర్వేరుగా ఈ పోటీలు జరగనున్నాయని ఆ విద్యాలయ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఆర్ సత్యనారాయణ, పి.అనురాధ తెలియజేశారు.

✖ Close హోం

సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి ఉదారత

విద్యార్థినికి బ్యాగు అందజేస్తున్న సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి 

చిత్రం న్యూస్, జైనథ్  ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం లక్ష్మీపూర్ ప్రాథమిక పాఠశాల లో విద్యార్థులకు చేయూత కార్యక్రమం నిర్వహించారు. సామాజిక కార్యకర్త మౌనిష్ రెడ్డి పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, నోట్ బుక్స్ తో పాటు అంగన్వాడీ పిల్లలకు పలకలు పంపిణి చేసి ఉదారత చాటారు.  ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్, హైస్కూల్ ప్రాథనోపాధ్యాయులు అశోక్, ఉపాధ్యాయులు సుప్రియ, సరిత, ,గ్రామస్తులు నారాయణ, గంగమ్మ, మనోజ్, అశోక్, విట్టల్ గన్నోజీ, నారాయణ, దేవమ్మ, భగత్ భూమారెడ్డి, ఆశన్నయాదవ్ తదితరులు ఉన్నారు.

వీల్ చైర్ అందజేత 

ఆదిలాబాద్ పట్టణంలోని ఓల్డ్ హోసింగ్ బోర్డు కాలనికి చెందిన ఎల్టి.దేవారెడ్డి కుమారుడు దివ్యాంగుడు ప్రణీత్ కు సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి వీల్ చైర్ అందజేశారు. ప్రణీత్ ను పాఠశాల కి తీసుకువెళ్ళడానికి తల్లి తండ్రులకి ఇబ్బందిగా మారిందని కాలనీ వాసుల ద్వారా తెలుసుకున్నాడు. వెంటనే స్పంధించి అతనికి వీల్ చైర్ అందజేసి ముడుపు మౌనిష్ రెడ్డి ఉదారత చాటుకున్నాడు. ఆయన వెంట నారాయణరెడ్డి,మోరేష్, రమణ, విట్టల్ రెడ్డి, హరినివాస్ రెడ్డి, విపుల్ రెడ్డి,సురేందర్ రెడ్డి, ఆశన్నాయాదవ్, దినేష్ రెడ్డి, ప్రణీష్ తదితరులు ఉన్నారు.

✖ Close హోం