చిత్రం న్యూస్, బోథ్: బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఈసారి బీసీ జనరల్ వర్గానికి కేటాయించబడినట్లు వ్యవసాయ శాఖ వర్గాల నుంచి సమాచారం అందినట్లుగా స్థానిక నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి వివిధ మండలాల నుండి పలువురు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, బోథ్ ప్రాంతంలో బీసీ వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన చట్ల ఉమేష్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. బోథ్ నియోజకవర్గంలో ప్రజా సేవలో ఎప్పుడూ ముందుండే నాయకుడిగా చట్ల ఉమేష్ మంచి పేరు సంపాదించుకున్నారు. గతంలో ఎంపీటీసీగా, పాక్స్ డైరెక్టర్గా పనిచేసిన ఆయన రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ రైతుల నమ్మకాన్ని పొందారు. రైతులు కష్టాల్లో ఉన్న సమయంలో అనేక వ్యవసాయ భూములకు చేరుకునేలా గ్రావెల్ రోడ్లు వేసినట్లుగా రైతులు పేర్కొన్నారు. రైతులకు రాకపోకలు సులభంగా ఉండేందుకు కల్వర్టులు నిర్మించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దీంతో అనేక గ్రామాల రైతులు తమ పంట పొలాలకు సులభంగా చేరుకునే అవకాశం కలిగిందని రైతులు తెలిపారు.మరోవైపు స్థానిక రాజకీయాల మధ్య ఈ పదవి ఎవరికి దక్కుతుందనే ఆసక్తి నెలకొంది. స్థానిక అధికార పార్టీ పెద్ద మొత్తం నాయకుల మద్దతు సైతం ఉమేష్ కు ఏకగ్రీవంగా ఉందని తెలుస్తోంది. బోథ్ నియోజకవర్గంలోని రైతులు, బీసీ సంఘాల నాయకులు, యువత కూడా చట్ల ఉమేష్కు బలమైన మద్దతు ప్రతిపాదిస్తున్నారు.
బోథ్ మార్కెట్ కమిటీ అభివృద్ధి, రైతులకు మెరుగైన సదుపాయాలు కల్పించడం, మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాల్లో ఆయన నాయకత్వం అవసరమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రైతు సంక్షేమం, మార్కెట్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే నాయకుడిగా చట్ల ఉమేష్ను బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించాలని పార్టీ అధిష్టానం ప్రభుత్వాన్ని స్థానిక నాయకులు, రైతు సంఘాలు కోరుతున్నాయి. ఇప్పటికే బీసీలకు కేటాయించిన ఈ పదవిని అలాగే కొనసాగిస్తూ బీసీ వర్గాలకు న్యాయం చేయాలని వారు స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా సామాజిక సమస్యలపై అవగాహన వాటి పరిష్కారం కోసం పలు రకాలుగా ప్రయత్నిస్తున్న వ్యక్తి ఆపదలో ఉంటే అండగా తాను ఉన్నానని భరోసా కల్పిస్తూ సాగుతున్న ఉమేష్ సేవలను గుర్తించి అధిష్టాన నాయకత్వం ఆశీర్వదించాలని అన్నదాతలు కోరుతున్నారు.

