చిత్రం న్యూస్, కైకలూరు: కైకలూరు నియోజకవర్గం కొల్లేటికోటలోని ” శ్రీ కొల్లేటి పెద్దింటి అమ్మ” జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం కళ్యాణ మహోత్సవం చేపట్టారు. ఈ సందర్భంగా కొల్లేరు ప్రజా సంక్షేమ సేవా సమితి చైర్ పర్సన్ ముంగర ఉమాదేవి శ్రీ కొల్లేటి పెద్దింటి అమ్మవారిని దర్శించుకుని బోనాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సంతోషంగా ఉండాలని రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకున్నానని ఆమె తెలిపారు.

