చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని కుప్తి గ్రామానికి చెందిన వారు నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై స్పందించిన ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భైంసా ఏరియా ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు.గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి, మృతి చెందిన వారి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

