చిత్రం న్యూస్, సాత్నాల: గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తూ మాజీమంత్రి జోగు రామన్న క్రీడాకారుల దాగి ఉన్న ప్రతిభను గుర్తించేలా వివిధ క్రీడలకు సంబంధించిన పోటీలకు పూర్తి సహకారాన్ని అందిస్తూ వస్తున్నారని మున్సిపల్ మాజీ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. సోమవారం సాత్నాల మండలం సైద్ పూర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలను మున్సిపల్ మాజీ చైర్మన్ ప్రేమేందర్ ప్రారంభించారు. క్రీడాకారులు పరిచయం చేసుకొని అభినందనలు తెలిపారు.. క్రికెట్ ఆడుతూ క్రీడా స్ఫూర్తిని చాటారు. ముందుగా గ్రామస్తులు పూల పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.జోగు ప్రేమేందర్.. మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.. జోగు ఫౌండేషన్ ప్రత్యేక క్రీడా పోటీలను ప్రోత్సహిస్తూ క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను గుర్తించడం జరుగుతుందన్నారు. ఈ క్రీడాల ద్వారా యువకులలో స్నేహపూర్వ సంబంధాలతో పాటు శారీరక మానసిక దృఢత్వం బలపడుతుందన్నారు.. ఈ కార్యక్రమంలో దేవన్న, రోహిదాస్, దేవన్న,చరణ్ శిగ్, జాదవ్, అంకుష్, ఆత్రం అంబదాస్, అంకుష్ గీత, ప్రతాప్, రోహిదాష్ తదితరులు పాల్గొన్నారు.

