Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

బేల జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆర్ ఓ ప్లాంటును ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా

చిత్రం, న్యూస్ బేల: బేల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతల సహాయంతో ఏర్పాటు చేసిన ఆర్ ఓ ప్లాంటుని జిల్లా కలెక్టర్ రాజర్శి షా, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు కొమ్ము కృష్ణకుమార్ ఆరోగ్య పాఠశాల, పాఠశాల యొక్క ప్రగతి నివేదికను జిల్లా కలెక్టర్ కు వివరించారు. పాఠశాలలో దాతలు అందించిన రూ.3 లక్షలతో విద్యార్థుల కోసం మంచి నీటి పథకంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అని చెప్పారు.మండలానికి చెందిన పలువురు దాతలను జిల్లా కలెక్టర్ సన్మానించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ రాజర్శి షా మాట్లాడుతూ ఆరోగ్య పాఠశాలను ముందుగా జిల్లాలో 130 పాఠశాలలతో ప్రారంభించి ఇప్పుడు 250 పాఠశాలలో ఈ కార్యక్రమం నడుస్తుందన్నారు. ఆరోగ్య పాఠశాల ముఖ్య ఉద్దేశ్యం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్య అలవాట్లు మార్చడం కోసమన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుందన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం ముందుకొచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే పదవ తరగతి వార్షిక పరీక్షలో బేల మండల ఉన్నత పాఠశాల వందశాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలో మొదటి స్థానం కైవసం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మనోహర్ రావు, మండల తహసీల్డార్ రఘునాథ్ రావు, ఎంపీడీవో అంజనేయులు, మండల విద్యాధికారి మహాలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొమ్ము కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments