చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చర గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ ఏనుగు రేఖ రాజేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి సన్మానించారు. శనివారం గ్రామానికి వెళ్లిన ఆయన శాలువా కప్పి సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సర్పంచ్ దివాకర్ రెడ్డి, గడ్డం శ్రీకాంత్ రెడ్డి, భూపేందర్, వెంకటి, కన్నా, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

