చిత్రం న్యూస్, బేల : బేలలోని డిగ్రీ పరీక్ష కేంద్రాన్ని బేలలో కాకుండా అదిలాబాద్ కు మార్చడం జరిగిందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కు ఏబీవీపీ నేతలు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నిఖిల్ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్ కు వివరించారు.సానుకూలంగా స్పందించిన ఆయన కేయూ అధికారులతో మాట్లాడి పరీక్ష కేంద్రాన్ని యధావిధిగా బేలలోనే ఏర్పాటు చేసే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు తరుణ్, శ్రీకాంత్, కుర్మా పవన్ రెడ్డి, యోగేష్, బాలాజ, వద్యార్థులు తదితరులు పాల్గొన్న

