శ్రీ దుర్గామాత వద్ద సామూహిక కుంకుమార్చన పూజలు
*ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న దీపోత్సవాలు
*కనుల పండువగా జరుపుకుంటున్న గ్రామస్తులు
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ (కె ) గ్రామంలో కొలువుదీరిన దుర్గామాత.. శ్రీ మహా సరస్వతి దేవి అలంకారంలో గ్రామస్తులకు దర్శనమిచ్చారు. గ్రామస్తులు దేవి నవరాత్రుల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. సోమవారం దుర్గాదేవి మండపం వద్ద సామూహిక కుంకుమార్చన పూజలు మహిళలు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు వేద మంత్రోచ్ఛరణాలతో శ్రీ మహా సరస్వతి దేవి అమ్మవారికి హారతులు ఇచ్చారు. అమ్మవారికి నైవేద్యంగా అటుకులు, బెల్లం కొబ్బరి అన్నం సమర్పించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన పూజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా నిర్వహించారు. అందరూ సుభిక్షంగా ఉండాలని దుర్గమ్మ వారిని వేడుకున్నారు.

