ఈఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ ల ఫొటో ట్రేడ్ హైదరాబాద్ ఎక్స్పో పోస్టర్లను ఆవిష్కరించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
చిత్రం న్యూస్, నేరడిగొండ :తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అసోషియేషన్ హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ఫొటో ట్రేడ్ హైదరాబాద్ ఎక్స్పో పోస్టర్లను నేరడిగొండ మండల కేంద్రంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. మారుతున్న కాలాన్ని బట్టి నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫొటోగ్రాఫర్ల సంఘం జిల్లా అధ్యక్షులు దోడ అశోక్, ఉపా అధ్యక్షులు ముప్కాల ప్రవీణ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాపాక విజయ్ కుమార్, జనరల్ సెక్రటరీ పెరుమాండ్ల సురేష్, కోశాధికారి వినోద్, ఉపాధ్యక్షులు జాదవ్ సంతోష్, ఫొటోగ్రాఫర్లు అన్వేష్, శేఖర్, సాయి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

