-Advertisement-

బాసరలో మంత్రి జూపల్లి కృష్ణారావు  పర్యటన

బాసరను ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కృషి_మంత్రి జూపల్లి కృష్ణారావు 

*జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు

*మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,  కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

చిత్రం న్యూస్, భైంసా(బాసర): నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ పూర్ణకుంభంతో ఆహ్వానించారు. ఆనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిని ఆలయ అధికారులు శాలువాతో సత్కరించి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే మహంకాళి అమ్మవారిని కూడా దర్శించుకున్నారు.అనంతరం మంత్రి జూపల్లి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అధికారులతో సమావేశం నిర్వహించి ఆలయ అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు రూ.190 కోట్ల వ్యయంతో బాసర ఆలయ మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో చర్చించి బాసర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాసరను ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాల కోసం ఇప్పటికే పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేలా అన్ని శాఖలతో సమన్వయం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. బాసర ఆలయ అభివృద్ధిపై తాను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నానని వివరించారు. బాసరలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.  వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. బాసరలోని  ఆర్జేయూకేటీని సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

 కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్సీ  దండే విఠల్, నిర్మల్ జిల్లా కలెక్టర్ శ్రీ అభిలాష అభినవ్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో అంజనా దేవి, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,  కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి, ముథోల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నారాయణరావు పటేల్, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్  ఆనందరావు పటేల్, మాజీ జడ్పీటీసీ పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, బాసర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments