ఆడే గజేందర్ ని కలిసిన నేరడిగొండ భగత్ సింగ్ కాలనీవాసులు
చిత్రం న్యూస్ నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ ని నేరడిగొండ భగత్ సింగ్ కాలనీవాసులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కాలనీలో గల పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని ఆడే గజేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ కాలనీ సభ్యులు సంతోష్, మణి, అరుణ్, ప్రవీణ్, అనిల్, నాయకులు ఎఎండీ సద్దాం, కపిల్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.




