పింఛన్ల సభను జయప్రదం చేయాలి
చిత్రం న్యూస్, భైంసా:చేయూత పింఛన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ భైంసా సబ్ డివిజన్ కేం ద్రంలో ఈ నెల 22న నిర్వహించే వికలాంగుల చేయూత, పింఛన్దారుల సన్నాహక సదస్సును జయప్రదం చేయాలని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సందే కార్తీక్ మాదిగ కోరారు. నిర్మల్ జిల్లా భైంసా సబ్ డివిజన్ పరిధిలో అన్న బహు సాఠె కమిటీ హాల్ లో ఏర్పాటు చేసిన సమామావేశంలో గురువారం సందే కార్తీక్ మాదిగ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు రూ.4వేల నుంచి రూ.6వేలకు, వృద్ధులు, ఒంటరి మహిళలకు రూ.2వేల నుంచి రూ.4వేలకు పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఈ సభకు హాజరువుతారని, వృద్ధులు, దివ్యాంగులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు బాలే రావు నందకుమార్, మాదిగ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు గాయక్వాడ్ గంగాధర్, ఎస్సీ, ఎఎస్టీ,బీసి ప్రైవేట్ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్తాపకులు నామత్కర్ దిగంబర్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు షెల్కె ఆనంద్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు తుకారం, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ అధికార ప్రతినిధి నిర్మల్ మహేష్, ఎమ్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు అంబేకర్ సాయిచంద్, ఎమ్మార్పీఎస్ నాయకులు గజ్జరం, మారుతీ, దిగంబర్, గజేందర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
