సామాజిక సమరసత లో మహిళల పాత్ర
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో గురువారం “సామాజిక సమరసత లో మహిళల పాత్ర” అనే అంశంపై ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ ఆవరణలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా హాజరైన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రుక్మిణి దేవి మహిళలు సమాజంలో ఉన్న అసమానతలు తొలగించడంలో ముఖ్య పాత్ర గురించి మాట్లాడారు. మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ రమ్యా రావు M.D (NRI USA) హాజరై మన సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విలువైనవని వాటిని కాపాడవలసిన బాధ్యత మనందరిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలకేంద్రం కళా బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి.
ఈ కార్యక్రమంలో సామాజిక సేవా సమితి జిల్లా అధ్యక్షులు రావుత్ రవీందర్, ప్రధాన కార్యదర్శి సామ రమేశ్ రెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు సరిత రాణి, ప్రధాన కార్యదర్రాశురాలు సత్య శివాలిని, సంయోజకులు మెస్రం రాజేశ్వర్, ట్రెజరర్ నాగరాజు,ఉపాధ్యక్షులు చాట్ల స్వామి, కార్యదర్శులు వేణు గోపాల్, కాసర్ల శ్రీనివాస్,గౌరవ అధ్యక్షులు భోయర్ అశోక్,సలహాదారులు ఆచి శ్రీనివాస్, అధిక సంఖ్యలో మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
