ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలిస్తున్న ఎంపీడీవో మహేష్ కుమార్
చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని బెల్లూరి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ పనులను ఎంపీడీవో మహేష్ కుమార్ గురువారం పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా ఆర్థికంగా ఇబ్బంది ఉంటే స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళలకు బ్యాంక్ లలో తక్కువ వడ్డీకి రుణ సదుపాయం పొందే అవకాశం ఉందని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట గ్రామ పంచాయితీ కార్యదర్శి చక్రవర్తి, గ్రామస్థులు బాజీరావ్, పొట్టేన్న , దేవన్న,ఆకాష్, సుజీత్, పలువురు ఉన్నారు.

