మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రావుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న మేకల జితేందర్
చిత్రం న్యూస్, బేల: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం, జెండా మోసి కష్టపడి పనిచేసిన వారికి టిక్కెట్లు ఇవ్వాలని యువజన కాంగ్రెస్ బేల మండల సోషల్ మీడియా కన్వీనర్ మేకల జితేందర్ కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ మినిస్టర్ క్వాటర్స్ లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎంతగానో కృషి చేయడం జరిగిందని తెలిపారు. రిజర్వేషన్ల ఆధారంగా అవకాశం కల్పించి వారి గెలుపుకు సహకరించాలని కోరారు.

