ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ
లబ్ధిదారురాలికి ప్రొసీడింగ్ పత్రాన్ని అందజేస్తున్న ఏఎంసీ చైర్మన్ బొడ్డుగంగారెడ్డి, ఆత్మ చైర్మన్ రాజు యాదవ్
చిత్రం న్యూస్, సొనాల: సొనాల మండల కేంద్రంలో సిరిపురం చిన్నమ్మకి ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ కాపీని ఏఎంసీ ఛైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఆత్మ చైర్మన్ రాజు యాదవ్ అందజేశారు. ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఆత్మ చైర్మన్ రాజు యాదవ్లు మాట్లాడుతూ.. ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి బిల్లులు అందుతున్నాయని మొదలుపెట్టని వారు మొదలుపెట్టాలని ప్రతి ఒక్కరికి బిల్లు ఇప్పించే బాధ్యత మాదన్నారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి,ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, ఎంపీడీవో , పంచాయతీ కార్యదర్శి లను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రమేష్ బత్తుల, సీనియర్ నాయకులు గాజుల పోతన్న, కసిరే పోతన్న, పీఏసీఎస్ డైరెక్టర్ పోశెట్టి, ఆత్మ డైరెక్టర్ ముండే శ్రీధర్, మాజీ సర్పంచ్ దాసు, అధికారులు ఎంపీడీవో రాజేశ్వర్, పంచాయతీ కార్యదర్శి, వెంకటరమణ, బిల్ కలెక్టర్ అజార్ తదితరులు పాల్గొన్నారు.


