రేషన్ కార్డులు పేదలకు వరం
*యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ ఆధ్వర్యంలో సీఎం, మంత్రుల చిత్ర పటాలకు పాలాభిషేకం
చిత్రం న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు చల్లూరి రాహుల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వీరమనేని పరుశురాం, యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ మాట్లాడుతూ. ఇందిరమ్మ రాజ్యం లో పేదలు సుభిక్షంగా ఉండాలనే ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందని, రేషన్ కార్డు పేదవారి ఆత్మగౌరవం అని అన్నారు. పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వాలన్న ఆలోచన మాత్రం చేయలేదని, ప్రజా ప్రభుత్వంలో సన్నబియ్యం కోసం రేషన్ షాపుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారన్నారు. కొత్తగా 5.6 లక్షల మందికి రేషన్ కార్డులు మంజూరు అయినవని, 26 లక్షల మంది పేర్లు కొత్తగా రేషన్ కార్డులలో నమోదు చేసి, 3.10 కోట్లమందికి సన్నబియ్యం పంపిణీ జరుగుతుందని తెలిపారు. రైతులు సంతోషంగా ఉంటేనే సోనియమ్మ కల నెరవేరుతుందన్నారు. ప్రజల ఆశీర్వాదాలతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గొప్ప మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు గారి ఆదేశాల మేరకు సీఎం, మంత్రులకు పాలాభిషేకం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో; యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శులు పాతకాల రమేష్, రేవంత్, మండల ఉపాధ్యక్షులు అరుణ్, జమ్మికుంట మండల ఉపాధ్యక్షులు రాచపల్లి సాగర్, దేవునూరి వినయ్, ఆకినపల్లి శ్యామ్, ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, కార్యదర్శులు వొల్లాల రవి, యేబుషి అజయ్, యూత్ నాయకులు రాచపల్లి రాజు, ఏరెడ్డి సతీష్, జావిద్, ఇటుకల గణేష్, పచ్చిమట్ల భాను, బండి పవన్, దీపక్, వెంకటేష్, అష్రఫ్, జాన్సన్, సాయి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.


