-Advertisement-

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి 

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. విద్యార్థులకు చేయూత కార్యక్రమంలో భాగంగా తన వంతుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బుక్కులు, బ్యాగులు, అందిస్తున్నానని తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్  రూరల్ మండలంలోని రాంపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బుక్స్, పెన్నులను, బ్యాగులను అందజేశారు. అంతకు ముందు గ్రామానికి విచ్చేసిన మౌనిష్ రెడ్డిని గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మౌనిష్ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు చేస్తున్న కృషిని కొనియాడారు. విద్యార్థులు మంచిగా చదివి గ్రామానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గంగారెడ్డి, ఉపాధ్యాయురాలు సునీత, గ్రామస్తులు కిష్టారెడ్డి, భోజరెడ్డి, లక్ష్మి బాయి, నగేష్ రెడ్డి, ప్రతాప్ యాదవ్, సంతోష్, రమేష్, వెంకట్,తదితరులు ఉన్నారు.

✖ Close హోం
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments