లాసెట్ లో రాష్ట్రస్తాయి మొదటి ర్యాంక్ సాధించిన రుతికను సన్మానిస్తున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్
చిత్రం న్యూస్, బోథ్: ఇటీవల వెలువడిన లాసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన ఎల్కుచి రుతికను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ అభినందించారు. శాలువాతో సన్మానించారు. ఉన్నత చదువులు చదివిస్తూ రితికను సహకరిస్తున్న ఆమె తండ్రి రాజశేఖర్ ను సైతం సన్మానించారు. ముందు ముందు కూడా చదువులో ఇలాగే రాణిస్తూ బోథ్ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఏ సమస్య ఉన్న అనిల్ అన్న ఉంటాడని మరచిపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ డా. ప్రసాద్ సంధ్యారాణి పాల్గొన్నారు.