బీర్సాయిపేట్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం
*అక్కడికక్కడే ఇద్దరు మృతి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం బీర్సాయిపేట్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ పట్టణం రిక్షా కాలనీకి చెందిన డాక్యుమెంట్ రైటర్ ఈర్ల రాజు తన కుటుంబ సభ్యులను తీసుకొని బెల్లంపల్లి నుంచి ఆదిలాబాద్ వెళ్తున్నారు. బీర్సాయిపేట్ శివారులోకి రాగానే కారు అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఈర్ల రాజుతో పాటు అతని భార్యకు గాయాలయ్యాయి ఈర్ల రాజు కుమారుడితో పాటు ఆయన అత్తమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. ఆయన కూతురు పరిస్థితి విషమంగా ఉంది.