రాజకీయాలతో సంబంధం లేకుండా గ్రామాల అభివృద్ధికి కృషి
*పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్, జైనథ్: రాజకీయాలతో సంబంధం లేకుండా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామంలో శ్రీ రమ మందిరంలో రూ. 50 లక్షల నిధుల వ్యయంతో కళ్యాణ మండపం నిర్మాణానికి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. మాకోడ గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ బిల్డింగ్ ను ఆయన ప్రారంభించారు . అనంతరం ఆకుర్ల గ్రామంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ని ప్రారంభించారు . ఆయన మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు అందే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా మొదటి విడతగా గ్రామంలో 30 ఇళ్లను మంజూరు చేసుకోవడం జరిగిందన్నారు. ఒక మంచి ఆలోచనతో నీతితో ,విలువలతో కూడిన రాజకీయం చేస్తూ ముందుకు వెళుతున్నానని అన్నారు.
నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన అవకాశం వల్లనే అసెంబ్లీలో రైతుల సమస్యలపై మాట్లాడి వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేయడం జరిగిందన్నారు. అధికారమనేది సొంతం కాదని.. ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని తెలిపారు. దీపాయిగూడలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఏ రోజు కూడా గ్రామానికి వచ్చిన దీపాయిగూడ గ్రామస్తులు తనకు మనస్ఫూర్తితో ఆశీర్వాదం అందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రవీంద్రనాథ్, బీజేపీ మండల అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి , మాజీ ఉప సర్పంచి తిప్పిరెడ్డి రాకేష్ రెడ్డి, ఎల్టి అశోక్ రెడ్డి, విశాల్, విజయ్, గంగాధర్ భూమన్న వేద వ్యాస్, భూమన్న, సింగడి రమేష్ రెడ్డి, వెంకట్ రెడ్డి, దత్త తదితరులు పాల్గొన్నారు