కరంజిలో ప్రీ ప్రైమరీ తరగతి గది ప్రారంభించిన సర్పంచ్ శైలజ పొచ్చన్న
చిత్రం న్యూస్,జైనథ్: మండలంలోని కరంజి-Kగ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతి గదిని గ్రామ సర్పంచ్ గొంటిముక్కుల శైలజ పొచ్చన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆకర్షణీయమైన చిత్రాలు, ఆట వస్తువులు, ఫర్నిచర్తో కూడిన ఈ గది పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుందని, చుట్టుపక్కల గ్రామాల పిల్లలు కూడా ఇందులో చేరాలని కోరారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు ఎస్.విజయ సారథి, ప్రధానోపాధ్యాయుడు ఎస్. చిన్నయ్య, ఇన్స్ట్రక్టర్ జాహ్నవి, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
