గ్రామ సర్పంచులకు అవగాహన కార్యక్రమం
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్ డివిజన్ పరిధిలో కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచులతో మన ఊరు – మన భద్రత – మన బాధ్యత అనే కార్యక్రమాన్ని నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ లోని కామాక్షి కన్వెన్షన్ హాలులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, హాజరయ్యారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు అరైవ్- అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా నిర్వహించాలనే ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుందన్నారు. వ్యవసాయదారులు రోడ్డు పై ధాన్యం ఆరబెట్టినప్పుడు భద్రత కోన్లు, లేదా బకెట్ పెట్టి స్టిక్కర్లు అంటించాలని , డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకం నిషేధం అని , ప్రతిఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనాల మధ్య తగినంత దూరం ఉండేటట్లు చూడాలని , యువత డ్రగ్స్ కు బానిస కాకుండా ప్రతీ ఒక్కరు వారిని గమనిస్తూ ఉండాలన్నారు.
ఆన్లైన్ బెట్టింగ్ కు దూరంగా ఉండాలని , రోడ్డు భద్రతా నియమాలు , ట్రాఫిక్ నిబంధనలు , డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతులపై అవగాహన కల్పించారు. అధిక వేగం , క్రమశిక్షణ లోపం , అలసటతో వాహనం నడపడం వంటి అంశాలు ప్రమాదాలకు దారి తీస్తాయని వివరించారు. ఆరోగ్యంపై శ్రద్ధ , ట్రాఫిక్ నియమాల కట్టుదిట్టమైన పద్ధతుల ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో అవగాహన పెరిగి, రోడ్డు ప్రమాదాల నివారణకు , డ్రగ్స్ మీద యువతకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఆర్మూర్ లో రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి యొక్క తల్లిదండ్రులు వచ్చి మాట్లాడారు. అనంతరం అరైవ్ అలైవ్ సంబందించిన ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి. బస్వా రెడ్డి , ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ లహరి రఘు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కాటిపల్లి గంగారెడ్డి , ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఆర్మూర్ టౌన్ సీఐ సత్యనారాయణ , ఆర్మూర్ రూరల్ సీఐ జి. జాన్ రెడ్డి, ఐ-రాడ్ మేనేజర్ వర్ష , ఆర్మూర్ డివిజన్ ఎస్ఐ లు రజనీకాంత్, సంజీవ్ , అనిల్ , రాము , శ్యామ్ రాజ్ , శైలేందర్ , కిరణ్ పాల్ , రాజేశ్వర్, ఎన్ ఎస్ సి కౌన్సిల్ మెంబర్స్ సుందర్ , క్రాంతి గంగారెడ్డి , నిజంసాగర్ మాజీ లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ వై.సాయ రెడ్డి , సాగర్ రెడ్డి , గ్రామ సర్పంచులు ,వార్డ్ కౌన్సిలర్లు, ప్రజలు, పోలీస్ కళా బృందం సభ్యులు పాల్గొన్నారు.

