మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన హోం మంత్రి వంగలపూడి అనిత
చిత్రం న్యూస్, ఏలూరు: ఏలూరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, ఏలూరు రేంజ్ ఐజీ జి వి జి అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తో కలిసి రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. తొలుత ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటుచేసిన అభయ షీ బాక్స్ ను ఆమె ప్రారంభించారు. అనంతరం మంత్రి అనితను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో గ్రూప్ ఫొటోలు దిగారు. మహిళా కానిస్టేబుల్ ను పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను కూడా ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జడ్పీ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు పత్సమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్,AMC చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, టీడీపీ టౌన్ సెక్రటరీ రెడ్డి నాగరాజు, టీడీపీ నాయకులు ఆర్నెపల్లి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

