చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర సూరెళ్లి గ్రామంలో ఆనంద్ అనే రైతుకు చెందిన మొక్కజొన్న పంట విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధమైందని, రైతును రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని బాసర మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కోర్వ శ్యామ్ డిమాండ్ చేశారు. ముథోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యులు డాక్టర్ కొమ్రేవార్ ఆదేశాల మేరకు రైతు వద్దకు చేరుకుని తమ పార్టీ తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని రైతుకు భరోసా కల్పించారు. కష్టపడి చేతికి వచ్చిన పంట పూర్తిగా దగ్ధం కావడంతో స్థానిక ఎమ్మార్వో పవన్ చంద్రకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. రైతు పంట నష్టాన్ని అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రెవెన్యూ అధికారులకు పార్టీ నేతలు కోరారు. వెంట శ్రీనివాస్ ,మంతెన పోశెట్టి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

