-Advertisement-

ఉచిత మెగా వైద్య ఆరోగ్య శిబిరం 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్  ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ నిజామాబాదు వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం ( మహిళలకు క్యాన్సర్ సంబంధించిన) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది 24/7 విధినిర్వహణలు నిర్వహిస్తూ తమ ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు ఎల్లప్పుడూ తీసుకోవాలని అందుకోసం డా. సూచనలు,  సలహాలు పాటించాలన్నారు. మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం గురించి వివరించారు. క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తించడం ద్వారా చికిత్స సులభం అవుతుందని ప్రతి ఒక్కరూ నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ఆరోగ్యం బాగున్నప్పుడే విధి నిర్వహణకు తమ శరీరం సహకరిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. సిబ్బంది ఎల్లప్పుడూ మందులు వాడే బదులు ముందస్తు జాగ్రత్తలు పాటించినట్లయితే ఆరోగ్యానికి ఎలాంటి హాని కలవకుండా ఉంటుందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్నటువంటి ఫ్రూట్స్ వివిధ రకాల ఫ్రూట్స్ నుండి అన్ని రకాల జాగ్రతలు తీసుకొని వాటిని వాడాలని తెలిపారు. మన శరీరమునకు ఏ ఆహారం తింటే జీర్ణం అవుతుందో అదే ఆహారాన్ని తీసుకోవాలని అంతేకానీ జీర్ణం కానీ ఆహారము తీసుకొని బాధపడకూడదు అని అన్నారు. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని , ప్రతి ఆరు నెలలకు ఒకసారి సిబ్బంది తమ ఆరోగ్యాన్ని సంబంధిత డాక్టర్లకు చూయించుకోవాలని , డాక్టర్ల సూచనలు సలహాలు తప్పనిసరి పాటించాలని కోరారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ మరియు ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఇలాంటి క్యాంపు నిర్వహించడం ఎంతో శోభదాయకమని భవిష్యత్తులో ఇలాంటి క్యాంపులు ఇంకా అనేక నిర్వహించాలని పోలీస్ కమిషనర్ ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మహిళా పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. క్యాన్సర్ వైద్య విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి వైద్య సలహాలు అందించారు. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ వంటి వ్యాధులపై అవగాహన కల్పించారు. 30 సంవత్సరాల పైబడిన మహిళలు మూడు సంవత్సరాలకు ఒక సారి పంప్స్మీర్ పరీక్ష, 40 సంవత్సరాలు పైబడిన మహిళలు రెండు సంవత్సరాలకు ఒక సారి మామోగ్రఫీ పరీక్ష చేయించుకోవాలని సూచించారు  ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి.బస్వారెడ్డి, అదనపు డీసీపీ (సి.ఏ.ఆర్) కె.రాంచందర్ రావ్ , పోలీస్ యూనిట్ డా. సరళ, డా.అమర్ దీపిక (మెడికల్ డైరెక్టర్ ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్), డా.పి.అరవింద్ (రేడియేషన్ ఒంకలోజిస్ట్), డా. శైలజ (గైనకాలజిస్ట్), డా.రితిక ( డీఎమ్ఓ ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్), డా. రవీంద్రనాథ్ సూరి (సీనియర్ డా. ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ ) , మధు (స్క్రీనింగ్ క్యాంపు కోఆర్డినేటర్), నిజామాబాద్, ఆర్మూర్ , బోధన్ పోలీస్ స్టేషన్ మహిళా సిబ్బంది, పోలీస్, రేంజ్ కార్యాలయం మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments