* వివరాలు వెల్లడిస్తున్న బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిస్తున్న ముగ్గురికి కోర్టు జైలు శిక్ష విధించింది.పెగడపల్లి గ్రామానికి చెందిన వై. వెంకట రమణకు రూ. 10 వేల జరిమానాతో పాటు నాలుగు రోజుల జైలు శిక్ష, పట్టణంలోని రాకసి పేట్ కు చెందిన బాలచందర్ కురూ.10 వేల జరిమానాతో పాటు రెండు రోజుల శిక్ష,అబ్దుల్ గఫార్ కు నాలుగు రోజుల జైలు శిక్ష విధిస్తూ బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి తీర్పు ఇచ్చారని బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు.ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ..మద్యం తాగి వాహనాలను నడపరాదని పోలీసులు, అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా వాహనదారుల్లో మార్పు రాకపోవడం బాధాకరమని అన్నారు.మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురికావద్దని, తాగి వాహనాలను నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.

