-Advertisement-

లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు బీజేపీ ఎడపల్లి మండల శాఖ అధ్యక్షులు కోల ఇంద్రకరణ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు గ్రామానికి చెందిన సంఘం సాయమ్మ, సంఘం లాస్య లు గత కొంతకాలం క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ సందర్భంగా వారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ని కలిసి దరఖాస్తు చేసుకున్నారని అయన తెలిపారు. ఈమేరకు ఎంపీ అరవింద్ సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించారని అన్నారు. మంగళవారం ధర్మారం గ్రామంలో బాధితులు సంఘం సాయమ్మకు రూ.49,500,సంఘం లాస్యకు రూ.15 వేలు చెక్కులను పార్టీ మండల అధ్యక్షులు కోల ఇంద్రకరణ్, ధర్మారం గ్రామ బీజేపీ నాయకులు కోటేష్ ల చేతుల మీదుగా పంపిణి చేశారు. సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించిన ఎంపీ అరవింద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బోధన్ నియోజకవర్గం నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి లకు ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments