-Advertisement-

లేఖర్ వాడలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

చిత్రం న్యూస్, భోరజ్: హిందూ ధర్మ పరిరక్షణ, సామజిక మరసత లక్ష్యంగా లేకర్వాడ ఉప మండలం (లేకర్వాడ, కౌట, సాంగ్వి, పెండల్వాడ, సావాపూర్, బాలాపూర్, ఆకుర్ల గ్రామాలు) ఆధ్వర్యంలో ‘హిందూ సమ్మేళనం’ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11 న లేకర్వాడలోని విఠల్ రుక్మిణి ఆలయ ప్రాంగణంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జరగనుంది. ఉదయం 10:15 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు ఈ సమ్మేళనం కొనసాగుతుంది. లోక కల్యాణం కోసం భక్తులందరితో కలిసి సామూహిక పారాయణం, శాంతి, సౌభాగ్యాల కోసం ప్రత్యేక హోమం జరగనుంది.

ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా శ్రీ యోగానంద సరస్వతి (గోపాల కృష్ణ మఠం పీఠాధిపతి), ముఖ్య అతిథిగా శ్రీ విశోక తీర్థ స్వామి (శ్రీ సత్యానంద ఆశ్రమం), ప్రధాన వక్తగా శ్రీ డారావినూతల శశిధర్ (VHP జాతీయ అధికార ప్రతినిధి) విచ్చేసి భక్తులకు దిశానిర్దేశం చేయనున్నారు. హిందూ సమాజంలో ఐక్యతను చాటేందుకు కులమతాలకు అతీతంగా హిందూ బాంధవులందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని హిందూ సమ్మేళన నిర్వహణ సమితి కోరింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments