చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో రూ. 225 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్షరాభ్యాసాలు, కుంకుమార్చనలు, సత్యనారాయణ వ్రతాలు వంటి ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.

