చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలోని పురాతన దేవాలయం రేణుకపూర్ లోని దక్షిణముఖి హనుమాన్ ఆలయానికి ఆలయ అధ్యక్షుడు సంజీవరావు దేశ్ముఖ్ గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయ పునఃనిర్మాణం పనుల అభివృద్ధి కోసం రూ.2 లక్షల విరాళం చెక్కును హనుమాన్ ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గురు స్వామికి అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని అదేవిధంగా భక్తులు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారన్నారు. వెంట పీఆర్ఓ నర్సూరి భీంరావు, మాజీ సర్పంచ్ సతీశ్వర్ రావు, మమ్మాయి మురళి, కార్తీక్ రావు, ఆకాష్, గంగాధర్, రాజు,పోతన్న, అంజన్న స్వాములు తదితరులు పాల్గొన్నారు.


