చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయ పరిధిలోని ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలో మంగళ వారం ఉదయం 11:00 గంటలకు మామిడి (208 చెట్లు), నిమ్మ (30 చెట్లు) ఫలసాయపు హక్కుల కోసం కౌలు వేలం (ఓపెన్ ఆక్షన్) నిర్వహించనున్నట్లు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. కె. ప్రభావతి తెలిపారు. వేలంలో అత్యధిక ధర పలికిన వారికి మాత్రమే ఫలసాయపు హక్కులు షరతులకు లోబడి ఇవ్వనున్నామన్నారు. ఔత్సాహికులు వేలంలో (ఓపెన్ ఆక్షన్) పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.


