చిత్రం న్యూస్, భీంపూర్:ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం కరంజి (టి ) గ్రామంలో శ్రీరామ నవమి కళ్యాణోత్సవం సందర్భంగా నిర్వహించనున్న భజన పోటీల కరపత్రాన్ని తెలుగు భజన మండలి సభ్యులు విడుదల చేశారు. ప్రతి బృందంలో ఏడుగురు సభ్యులు ఉండాలని, ప్రదర్శనకు 30 నిమిషాల సమయం ఇస్తారని నిర్వాహకులు తెలిపారు.ఆసక్తి గల భజన బృందాల వారు మరిన్ని వివరాలకు 8985206209, 7083442773 నంబర్లకు సంప్రదించాలని తెలిపారు.


