-Advertisement-

చలో దిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

చిత్రం న్యూస్, ఉట్నూర్: మే 24న నిర్వహించే చలో దిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  రాయిసెంటర్ జిల్లా అధ్యక్షులు మెస్రం దుర్గు పటేల్ పిలుపునిచ్చారు. మతం మారిన ఆదివాసులను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్‌తో గిరిజన సురక్ష మంచ్ ఆధ్వర్యంలో ఉట్నూర్‌లో “చలో దిల్లీ” పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మే 24న జరిగే “చలో డిల్లీ” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని 9 ఆదివాసీ తెగల పెద్దలు, రాయిసెంటర్ సార్మెడీలు, పటేల్, దేవరీ, మహాజన్, గ్రామ సర్పంచ్‌లు, అన్ని సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జిల్లా నుండి వేల సంఖ్యలో ఆదివాసీ బంధువులను దిల్లీకి తీసుకెళ్లాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నైతమ్ శంకర్, సట్ల అశోక్, జైవంత్రావు మహారాజ్, తెకం సంతోష్, మోహన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments