Chitram news
Newspaper Banner
Date of Publish : 12 March 2026, 8:33 pm Editor : Chitram news

కలెక్టర్ రాజర్షి షా ను సన్మానించిన బేల మండల సర్పంచులు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమం “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” లో భాగంగా జిల్లాలో జరిగిన కార్యక్రమంలో బేల మండల సర్పంచులు కలెక్టర్‌ రాజర్షి షా ను శాలువతో సన్మానించి,పుష్పగుచ్చం అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సర్పంచులు నిరంతరం కృషి చేయాలని, మండల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో కలెక్టర్ చేస్తున్న కృషిని, ముఖ్యంగా ‘ప్రజా పాలన’ కార్యక్రమం ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడంలో చూపుతున్న చొరవను వారు ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు అనిల్, వినోద్, దౌలత్ రావ్ తదితరులు పాల్గొన్నారు.