Chitram news
Newspaper Banner
Date of Publish : 12 March 2026, 5:41 pm Editor : Chitram news

ఆదిలాబాద్‌ను అభివృద్ధి పథంలో నిలుపుదాం: ఎమ్మెల్యే పాయల్ శంకర్

PAYALచిత్రం న్యూస్,ఆదిలాబాద్: అభివృద్ధి పనుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. ’99 రోజుల ప్రజా పాలన’ ఓరియెంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని, ప్రతి ప్రభుత్వ శాఖ పనితీరుపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వెనుకబడిన ఆదిలాబాద్ ప్రాంతాన్ని అందరూ ఐక్యంగా అభివృద్ధి చేసుకుందామని, సర్పంచులు, కౌన్సిలర్లకు తన పూర్తి సహకారం ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.