చిత్రం న్యూస్, భోరజ్: ఆదిలాబాద్ నియోజకవర్గం భోరజ్ మండలం బాలాపూర్ ప్రాథమిక పాఠశాలలో EGS నిధులతో నిర్మించనున్న కిచెన్ షెడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థుల సౌకర్యార్థం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నాయని తెలిపారు. జైనథ్ మండలం బెల్గాం వద్ద సుమారు రూ.200 కోట్లతో ‘యంగ్ ఇండియా స్కూల్’ మంజూరైందని, దీనివల్ల 3500 మంది పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఉచిత విద్య అందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అచ్యుత్, మాజీ సర్పంచులు తమ్మడి భగవాండ్లు, వినోద్ యాదవ్, బీజేపీ నాయకులు విఠల్, ప్రశాంత్, వేణు, శంకర్, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతి నిధులు పాల్గొన్నారు.