చిత్రం న్యూస్, జైనథ్: కాప్రి గ్రామానికి చెందిన యెల్టి వెంకట్ రెడ్డి సాంగిడి గ్రామ శివాలయ నిర్మాణానికి తమ భక్తి భావంతో రూ.30వేలు విరాళంగా అందజేశారు. వెంకట్ రెడ్డి గారి దాతృత్వం, భక్తి భావం దేవాలయ నిర్మాణానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. దేవుని ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు