Chitram news
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 6:30 pm Editor : Chitram news

కనుల పండువగా అంజన్న మహా పడిపూజ 

చిత్రం న్యూస్, ముథోల్: నిర్మల్ జిల్లా ముథోల్ మండలం ఆష్ట గ్రామంలో అంజన్న మహా పడిపూజ కనుల పండువగా సాగింది. ఫకీరాబాద్ నాగేష్ గురు స్వామి ఆధ్వర్యంలో మహాపడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నాగేష్. గురుస్వామి నేతృత్వంలో జరిగిన పూజా కార్యక్రమంలో సుమారు 200 మంది అంజన్న స్వాములు పాల్గొని అంజన్న నామస్మరణ చేస్తూ పాటలు పాడారు. భక్తి గీతాలను ఆలపించారు. స్వామియే శరణం అంజన్న..స్వామియే శరణం అంజన్న అంటూ అంజన్న స్వామి నామస్మరణతో అష్ట గ్రామంలో మార్మోగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, అంజన్న భక్తులు పాల్గొన్నారు