Chitram news
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 8:58 pm Editor : Chitram news

నిజాయతీని చాటుకున్న ఆలయ హోంగార్డ్స్  

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలుపోగొట్టుకున్న తన పర్సును ఆలయ హోంగార్డులు అందజేసి తమ నిజాయతీ చాటుకున్నారు. హైదరాబాద్ కు చెందిన సుజాత అనే భక్తురాలు ఆలయ ప్రాంగణంలో రూ.5 వేల నగదు ఉన్న చేతి పర్సును మర్చిపోయింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు వెంకటేష్,రాందాస్ కు దొరకడంతో ఆలయ ఇన్స్పెక్టర్, జూనియర్ అసిస్టెంట్ సాయిలుకు అందజేసి తిరిగి భక్తురాలికి అందజేశారు. దీంతో తోటి భక్తులు హోంగార్డులను అభినందించారు.