చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలంలోని ఉప్పుకుంటగల్లీలో ఆదివారం రాత్రి పల్సర్ బైక్ దొంగతనానికి గురి అయింది. కుటుంబ సభ్యుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్రామానికి చెందిన పిల్లివార్ కిరణ్ ఇంటి ఆవరణ ముందు పల్సర్ ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళాడు. సోమవారం వేకువజామున లేచి చూసేసరికి పల్సర్ బైక్ నెంబర్:TG18A9896 చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు.కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.దొంగతనాల నివారణను అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ తమ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై నవనీత్ రెడ్డి గ్రామస్తులను కోరారు.